News July 18, 2024
సింహాచలం గిరి ప్రదక్షిణ.. రూట్ మ్యాప్ ఇదే

ఈనెల 20న జరిగే సింహాచలం గిరి ప్రదక్షిణ తొలి పావంచ వద్ద మొదలుపెట్టి.. అడవివరం-ధారపాలెం-ఆరిలోవ-హనుమంతువాక-పోలీసు క్వార్టర్స్- కైలాసగిరి టోల్ గేట్- అప్పుఘర్ జంక్షన్- MVPడబుల్ రోడ్-వెంకోజీపాలెం- HB కాలనీ-కైలాసపురం-మాధవధార-మురళీనగర్-బుచ్చిరాజుపాలెం-లక్ష్మీ నగర్-ఇందిరా నగర్- ప్రహ్లాదపురం-గోశాల జంక్షన్-తొలి పావంచ మీదుగా సింహాచలం మెట్ల మార్గం చేరుకోవాలి. సుమారు 32 కిలోమీటర్ల ప్రదక్షిణ చేయాలి. >Share it
Similar News
News November 26, 2025
VZM: రేపు డయల్ యువర్ ఆర్టీసీ డీపీటీవో కార్యక్రమం

డయల్ యువర్ డీపీటీవో కార్యక్రమాన్ని గురువారం నిర్వహిస్తున్నట్లు విజయనగరం ఆర్టీసీ డిపో ప్రజా రవాణా అధికారి జి.వరలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. కాంప్లెక్స్ డీపీటీవో కార్యాలయంలో ఉదయం 11 గంటలు నుంచి 12 గంటల వరకు డయల్ యువర్ డీపీటీవో కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. డిపో పరిధిలో గల ప్రయాణికులకు ఎటువంటి సమస్యలున్నా, సలహాలు ఉన్న నం.9959225604 ద్వారా తెలిపి నివృత్తి చేసుకోవాలని కోరారు.
News November 26, 2025
గడ్డిమందు తాగి మహిళ మృతి: గజపతినగరం ఎస్ఐ

గజపతినగరం మండలం భూదేవిపేటకి చెందిన జగ్గినేని గౌరీ (43) కడుపునొప్పి కారణంగా ఈనెల 25 సాయంత్రం గడ్డి మందు తాగిందని గజపతినగరం ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు. ఆమెను చికిత్స నిమిత్తం విజయనగరం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు కుమార్తె డొంక పూజిత ఫిర్యాదు చేసిందన్నారు.గౌరి మృతిపై కుటుంబ సభ్యులకు కొన్ని అనుమానాలు ఉన్నాయని వాటిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.
News November 26, 2025
విజయనగరంలో 25 మందికి ఫైన్.. ఇద్దరికి జైలు శిక్ష

డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో 25 మందికి జరిమానాలు, ఇద్దరికి జైలు శిక్ష విధించినట్లు ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ మంగళవారం తెలిపారు. ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ 18 మందిలో 17 మందికి ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానా, ఒకరికి 5 రోజుల జైలు శిక్షను కోర్టు విధించిందన్నారు. రూరల్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ మరో 9 మందిలో 8 మందికి రూ.10వేల జరిమానా, ఒకరికి 5 రోజుల జైలు శిక్ష ఖరారైందని చెప్పారు.


