News April 13, 2025

సింహాచలం: చందనోత్సవానికి 51 ప్రత్యేక బస్సులు

image

సింహాచలంలో ఏప్రిల్ 30న జరిగే చందనోత్సవానికి కొండ మీదకు 51 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు శనివారం తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా కొండమీదకు వెళ్లే బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. గోశాల, శ్రీనివాస్ నగర్, అడివివరం నుంచి ఈ బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. ఆరోజున భక్తుల వాహనాలు కొండమీదకు అనుమతి లేదని ఈ బస్సులు వినియోగించుకోవాలన్నారు.

Similar News

News April 14, 2026

విశాఖ-బ్రహ్మపూర్ రైలు రీషెడ్యూల్

image

విశాఖపట్నం-బ్రహ్మపూర్ ప్యాసింజర్ రైలు (58532) మంగళవారం రీషెడ్యూల్ అయింది. లింక్ రైలు ఆలస్యంగా రావడంతో సాయంత్రం 5:45 గంటలకు బదులు 6:45 గంటలకు బయలుదేరుతుందని సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు. ప్రయాణికులు ఈ సమయ మార్పును గమనించాలని, వారికి కలిగిన అసౌకర్యానికి రైల్వే శాఖ విచారం వ్యక్తం చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

News April 14, 2026

విశాఖ-బ్రహ్మపూర్ రైలు రీషెడ్యూల్

image

విశాఖపట్నం-బ్రహ్మపూర్ ప్యాసింజర్ రైలు (58532) మంగళవారం రీషెడ్యూల్ అయింది. లింక్ రైలు ఆలస్యంగా రావడంతో సాయంత్రం 5:45 గంటలకు బదులు 6:45 గంటలకు బయలుదేరుతుందని సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు. ప్రయాణికులు ఈ సమయ మార్పును గమనించాలని, వారికి కలిగిన అసౌకర్యానికి రైల్వే శాఖ విచారం వ్యక్తం చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

News April 14, 2026

విశాఖలోని ఒక్కరోజే 2474 కేసులు

image

విశాఖలోని ట్రాఫిక్ పోలీసులు సోమవారం ఒక్కరోజే 2,474 కేసులు నమోదు చేశారు. వాటి వివరాలిలా ఉన్నాయి. హెల్మెట్ ధరించనని-1,209, పిలియన్ రైడర్-226, ట్రిపుల్ రైడింగ్- 112, ఓవర్ స్పీడ్-223, సెల్ఫోన్ డ్రైవింగ్-19, డ్రైవింగ్ లైసెన్స్ లేనివి-06, మైనర్ డ్రైవింగ్ 02, రాంగ్ పార్కింగ్-191, డ్రంకన్ డ్రైవింగ్-47, సీజ్ అయిన వెహికల్స్-58 ఎంవీ యాక్ట్ ఉల్లంఘన-501 కేసులు ట్రాఫిక్ పోలీసులు నమోదు చేశారు.