News April 13, 2025
సింహాచలం: చందనోత్సవానికి 51 ప్రత్యేక బస్సులు

సింహాచలంలో ఏప్రిల్ 30న జరిగే చందనోత్సవానికి కొండ మీదకు 51 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు శనివారం తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా కొండమీదకు వెళ్లే బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. గోశాల, శ్రీనివాస్ నగర్, అడివివరం నుంచి ఈ బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. ఆరోజున భక్తుల వాహనాలకు కొండమీదకు అనుమతి లేదని, ఈ బస్సులు వినియోగించుకోవాలన్నారు.
Similar News
News November 24, 2025
శ్రీకాకుళం జిల్లాస్థాయి సంఘ సమావేశాల నిర్వహణ

శ్రీకాకుళం జిల్లా స్థాయి సంఘ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు జడ్పీ సీఈఓ సత్యనారాయణ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రం నుంచి ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 29న ఈ సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. వివిధ స్థాయి సంఘాల ప్రతినిధులతో పాటు అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారన్నారు. సమావేశాలకు అధికారులు పూర్తిస్థాయి సమాచారంతో పాల్గొనాలని ఆదేశించారు.
News November 24, 2025
గొల్లపల్లి: గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, కలెక్టర్

గొల్లపల్లి మండల కేంద్రంలోని ఆవుల సాయవ్వకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తయ్యింది. సోమవారం జరిగిన గృహప్రవేశం కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ హాజరయ్యారు. పేదలకు సొంతింటి కల సాకారం చేయడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. ప్రొసీడింగ్స్ పొందిన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
News November 24, 2025
జగిత్యాల: నూతన డీఈ టెక్నికల్ అంజయ్య బాధ్యతలు

NPDCL జగిత్యాల విద్యుత్ శాఖలో ఎన్.అంజయ్య సోమవారం డీఈ (టెక్నికల్)గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. విధుల్లో చేరిన అనంతరం జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ సుదర్శనంను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా ఆయనతో శాఖ వ్యవహారాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అంజయ్య నియామకంతో జిల్లాలోని విద్యుత్ శాఖ ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు, సహచర అభ్యర్థులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.


