News January 29, 2025
సింహాచలం: చిరకాల సమస్యకు ఫుల్ స్టాప్..!

చిరకాలంగా ఉన్న సింహాచలం పంచ గ్రామాల సమస్యకు కూటమి ప్రభుత్వం బుధవారం ఫుల్ స్టాప్ పెట్టింది. సీఎం చంద్రబాబు విశాఖ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. పంచ గ్రామాల్లో నివసిస్తున్న సుమారు 12వేల మందికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో పంచగ్రామాల్లో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రభుత్వ నిర్ణయంపై మీ కామెంట్
Similar News
News February 10, 2025
విశాఖ జూలో తల్లి సాంబార్ డీర్ ప్రేమకు సందర్శకుల ఫిదా..!

తల్లులు తమ పిల్లల మీద చూపించే ప్రేమకు వెలకట్టలేము. విశాఖ జూ పార్కులో ఒక తల్లి సాంబర్ డీర్ తమ పిల్లను అల్లారు ముద్దుగా సాకుతో తల్లి ప్రేమ కు అవధులు లేవని నిరూపిస్తుంది. పిల్ల ఆకలి తెలుసుకుని పాలివ్వడం కాకుండా శత్రువుల నుంచి కాపాడేందుకు దట్టమైన వృక్షాల మధ్యలో దాచిపెడుతుంది. తల్లి ప్రేమకు సాధ్యమైన ఈ దృశ్యం చూపరులను ఆలోచింపజేస్తూ అందరూ ఫిదా అయ్యేలా చేస్తుంది.
News February 10, 2025
విశాఖ: నామినేషన్ల దాఖలుకు నేడు ఆఖరు

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC ఎన్నికకు సంబంధించి నామినేషన్ల దాఖలుకు ఈరోజు ఆఖరి రోజు కాగా ఇప్పటివరకు 8మంది నామపత్రాలు సమర్పించారు. సోమవారం ఎక్కువగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. నామినేషన్ల పరిశీలన ఈనెల 11న చేస్తారు. 13 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. 27వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 3వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.
News February 10, 2025
విశాఖలో పోలీస్ అధికారులతో సమీక్ష చేసిన డీజీపీ

విశాఖలో పోలీసుల పనితీరు చాలా బాగుందని క్రైమ్ రేట్ పెరగకూడదని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. కమిషనర్ కార్యాలయంలో అధికారులతో ఆదివారం సమావేశం నిర్వహించి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సమస్యలు విని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కమిషనర్తో పాటు డీసీపీలు పాల్గొన్నారు.