News May 20, 2024
సింహాచలం: నేడు కూడా కొనసాగనున్న చందనం అరగదీత

సింహాచలం అప్పన్న బాబు ఆలయంలో చందనం అరగదీత కార్యక్రమం ఆదివారం కూడా కొనసాగింది. ఈనెల 23న స్వామికి రెండవ విడత 120 కిలోల చందనాన్ని సమర్పించనున్నారు. దీనిలో భాగంగా ఈనెల 18న 40 కిలోలు, 19వ తేదీన37 కిలోల చందనాన్ని అరగదీసారు. సోమవారం కూడా చందనం అరగదీత కొనసాగుతుంది. ఆలయ స్థానాచార్యులు రాజగోపాల్ ఏఈఓ ఆనంద్ కుమార్ చందనం అరగదీత కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
Similar News
News January 7, 2026
9,10 తేదీల్లో విశాఖలో లైట్ హౌస్ ఫెస్టివల్ 3.0

విశాఖ వైభవాన్ని మరింత చాటిచెప్పేలా పోర్ట్స్, ఓడరేవుల శాఖ ఆధ్వర్యంలో ఈనెల 9, 10వ తేదీల్లో MGM పార్కులో లైట్ హౌస్ ఫెస్టివల్ 3.0 నిర్వహించనున్నట్లు JC మయూర్ అశోక్ బుధవారం తెలిపారు. ఫెస్టివల్లో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం 6 నుంచి సాంస్కృతిక ప్రదర్శనలు, ఇతర కార్యక్రమాలు ఉంటాయన్నారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర టూరిజం మంత్రి సురేశ్ గోపి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు.
News January 7, 2026
తప్పుడు రాతలు రాసే పోరాటం చేస్తా: మంత్రి లోకేశ్

తనను కించపరిచే విధంగా ఆర్టికల్ వేశారని ఆరోజు తను విశాఖలోనే లేనట్లు మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. 6 సంవత్సరాలుగా ఈ కేసుపై పోరాడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. తను విశాఖ వచ్చినప్పుడు ప్రభుత్వ వాహనాలు వాడటం లేదని, పార్టీ కార్యాలయంలోనే బస చేస్తున్నట్లు చెప్పారు. వార్తలు రాసే ముందు క్లారిటీ తీసుకోవాలని.. తప్పుడు రాతలపై తాను ఎప్పుడూ పోరాడుతునే ఉంటానని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.
News January 7, 2026
ఏయూలో బయో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు

భారత ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (DBT)కి చెందిన బిరాక్ (BIRAC) సహకారంతో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బయో నెస్ట్ (Bio NEST) బయో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటుకు అమోదం లభించింది. 3 సంవత్సరాల కాలానికి మొత్తం రూ.5 కోట్లతో చేపట్టిన ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ శతాబ్ధి వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో ఆంధ్రవిశ్వవిద్యాలయం కిరీటంలో మరొక కలికితురాయిగా నిలవనుందని రిజిస్ట్రార్ తెలిపారు.


