News May 20, 2024
సింహాచలం: నేడు కూడా కొనసాగనున్న చందనం అరగదీత

సింహాచలం అప్పన్న బాబు ఆలయంలో చందనం అరగదీత కార్యక్రమం ఆదివారం కూడా కొనసాగింది. ఈనెల 23న స్వామికి రెండవ విడత 120 కిలోల చందనాన్ని సమర్పించనున్నారు. దీనిలో భాగంగా ఈనెల 18న 40 కిలోలు, 19వ తేదీన37 కిలోల చందనాన్ని అరగదీసారు. సోమవారం కూడా చందనం అరగదీత కొనసాగుతుంది. ఆలయ స్థానాచార్యులు రాజగోపాల్ ఏఈఓ ఆనంద్ కుమార్ చందనం అరగదీత కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
Similar News
News January 8, 2026
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి ఘన స్వాగతం

భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గురువారం విశాఖ చేరుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్లో ఆయనకు మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పరశురాం రాజు స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన బయలుదేరి విశాఖలోని తన నివాసానికి చేరుకున్నారు. ఆయనను కలిసిన వారిలో పలువురు బీజేపీ నేతలు ఉన్నారు.
News January 8, 2026
విశాఖలో రేపు డీఆర్సీ సమావేశం

విశాఖలో డీఆర్సీని జనవరి 9న నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఇన్ఛార్జ్ మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఈ సమీక్షలో పాల్గొననున్నారు. పక్కా నివేదికలతో అధికారులు హాజరు కావాలని ఆయన ఆదేశించారు. అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలని, గతంలో చర్చించిన సమస్యలకు తీసుకున్న పరిష్కార చర్యలను తెలుపుతూ నివేదికలు తీసుకురావాలన్నారు. ప్రజా ప్రతినిధులు అడిగే ప్రశ్నకు సమాధానం ఇచ్చేలా ఉండాలని సూచించారు.
News January 8, 2026
విశాఖ మీదుగా వెళ్లే ‘వివేక్ ఎక్స్ప్రెస్’ రీషెడ్యూల్

కన్యాకుమారి – దిబ్రూగఢ్ వివేక్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (22503) నేడు (08.01.2026) రీషెడ్యూల్ చేయబడింది. సాయంత్రం 5:25 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు రాత్రి 9 గంటలకు బయలుదేరుతోంది. దీనివల్ల రేపు రాత్రి 11.50 గంటలకు విశాఖపట్నం చేరుకోవాల్సిన ఈ రైలు సుమారు 4 గంటల ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. ప్రయాణికులు ఈ మార్పును గమనించి తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.


