News April 7, 2024
సింహాచలం: 18 నుంచి అప్పన్న వార్షికోత్సవ కల్యాణోత్సవాలు

శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణ మహోత్సవాలను ఈనెల 18 నుంచి 24వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్టు దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి తెలిపారు. కల్యాణోత్సవాలను పురస్కరించుకుని విశేషంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈనెల 19న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవం, ఎదుర్కోలు ఉత్సవం, రథోత్సవం నిర్వహణ తదితర అంశాలపై చర్చించామని తెలిపారు.
Similar News
News November 16, 2025
కంచరపాలెంలో చెట్టుకు వేలాడుతున్న మృతదేహం

కంచరపాలెంలోని ఓ చెట్టుకు వేలాడుతున్న వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు శనివారం గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో కంచరపాలెం సీఐ రవికుమార్ సంఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. పదిరోజుల క్రితమే ఈ ఘటన జరిగి ఉండవచ్చని, మృతుని వయస్సు సుమారు 35-40 ఏళ్లు ఉంటుందని సీఐ తెలిపారు. మృతుని వివరాలు తెలియరాలేదని, దీనిని అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ చెప్పారు
News November 16, 2025
జగదాంబ జంక్షన్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి

జగదాంబ జంక్షన్లోని బస్స్టాప్ వద్ద ఓ వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న మహారాణిపేట సీఐ దివాకర్ యాదవ్ సంఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుని వివరాలపై ఆరా తీశారు. మృతుని ఒంటిపై గాయాలు లేవని.. అయితే అనారోగ్యం కారణంగా చనిపోయాడా? ఇంకా ఏమైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మృతదేహాన్ని KGH మార్చురీకి తరలించామని అతని వివరాలు తెలిస్తే తమను సంప్రదించాలని సీఐ కోరారు.
News November 16, 2025
విశాఖలో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి: మంత్రి

జీవీఎంసీ, VMRDA సంయుక్తంగా చేపడుతున్న పనులు వెంటనే పూర్తి చేయాలని మంత్రి నారాయణ సూచించారు. VMRDA కార్యాలయంలో అర్ధరాత్రి వరకు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, VMRDA కమిషనర్ తేజ్ భరత్, అధికారులతో పలు అంశాలపై చర్చించారు. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్లను అభివృద్ధి చేయాలని మంత్రి సూచించారు. లేఔట్లో మౌలిక వసతులు ఉండేలా చూడాలన్నారు.


