News January 16, 2025
సికింద్రాబాద్లో ముగిసిన కైట్ ఫెస్టివల్

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ బుధవారంతో ముగిసింది. 50 దేశాలకు చెందిన 150 మంది కైట్ ఫ్లైయర్స్ పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. సూపర్ హీరోలతో పాటు భారీ ఆకారంలో స్నేక్, గాడ్జిల్లా, వివిధ రకాల బొమ్మలు, హైదరాబాద్ మెట్రో సంస్థ(L&T)కు చెందిన ట్రైయిన్ కైట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేలాది మంది పరేడ్ గ్రౌండ్లో సంక్రాంతి సందర్భంగా ఎంజాయ్ చేశారు.
Similar News
News December 6, 2025
HYD: 31st NIGHT.. లోడింగ్!

సెలబ్రేషన్ అంటే హైదరాబాదీ ముందుంటాడు. రిలాక్స్ కోసం ప్రతి వీకెండ్లో పబ్లు, టూరిస్ట్ ప్లేస్లకు వెళ్లే నగరవాసి ఏడాది చివరిరోజైన DEC 31ST నైట్ చేసే ప్లానింగ్ మామూలుగా ఉండదు. న్యూ ఇయర్కు ఇంకా 25 రోజుల సమయం ఉన్నా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నారు. సిటీలో స్పెషల్ ఈవెంట్స్ ఏమైనా చేస్తున్నారా? అని టికెట్స్ కోసం సెర్చ్ చేస్తున్నారు. కొందరేమో శివారులోని ఫామ్ హౌస్లకు ఓటేస్తున్నారు. మరి మీ ప్లాన్ ఏంటి?
News December 6, 2025
HYDలో పెరుగుతున్న ‘ఫబ్బింగ్’ కల్చర్!

సిటీలో సామాజిక విలువలు పడిపోవడానికి ‘ఫబ్బింగ్’ కారణం అవుతోంది. చుట్టూ అందరూ ఉన్నా వారిని పట్టించుకోకుండా స్క్రీన్ చూడటం, మెసేజ్లు చెక్ చేయడం, ఫోన్కే అతుక్కోవడాన్ని ఫబ్బింగ్ అంటారు. ఇది అవతలి వ్యక్తికి గౌరవం లేదన్న భావన కలిగిస్తుంది. ఒంటరితనం, ఆందోళన వంటి సమస్యలు వస్తాయి. బంధాలను నిలబెట్టాలంటే ఈ డిజిటల్ ద్రోహాన్ని ఆపాలి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీలో ఎవరు ఫబ్బింగ్ చేస్తున్నారు? కామెంట్ చేయండి.
News December 6, 2025
గ్లోబల్ సమ్మిట్: రూ.250 లక్షల కోట్లే లక్ష్యం!

భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ కేవలం పెట్టుబడుల సమావేశం కాదు. ఇది రాష్ట్ర ఆర్థిక విధానాల విప్లవం. 2047 నాటికి $3 ట్రిలియన్ (సుమారు ₹250 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థ దిశగా ముఖ్యమంత్రి ఆవిష్కరించే ‘తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్’ సారాంశమే ఈ సమ్మిట్. తయారీ, టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పటిష్ఠమైన, స్థిరమైన నూతన పాలసీలను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది.


