News May 27, 2024

సికింద్రాబాద్: అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గట్టురట్టు

image

ఒడిశా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న అంతరాష్ట్ర స్మగ్లింగ్ ముఠా గుట్టును సికింద్రాబాద్ జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు రట్టు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 10వ ప్లాట్ ఫారం పైన అనుమానాస్పదంగా ఉన్న చందు వద్ద రూ.15.50 లక్షల విలువైన 62 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ ఎస్ఎన్ జావేద్ తెలిపారు. మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.

Similar News

News September 29, 2024

HYD: రూ.650 కోట్లతో కట్టుదిట్టంగా నాలా వ్యవస్థ

image

సీఎం రేవంత్ HYD నగరంలోని నాలాల వ్యవస్థను తక్షణమే సంస్కరించాలని నిర్ణయించారు.మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్‌తో ప్రత్యేక ప్రణాళికతో వచ్చే వర్షాకాలం నాటికి పనులు పూర్తి చేయాలన్నారు. నాలా పనుల కోసం రూ. 650 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించారు. అక్రమణల కారణంగా, నాలాల వెడల్పు 50 అడుగుల నుంచి 10 అడుగులకు చేరుకుంది. వీటిని తొలగించేందుకు హైడ్రాకు బాధ్యత అప్పగించనున్నారు.

News September 29, 2024

HYD: రాజాసింగ్ ఇంటి వద్ద అనుమానాస్పద వ్యక్తుల రెక్కీ

image

HYD గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి వద్ద ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు రెక్కీ నిర్వహించారు. అనుమానం రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించి వారిని అప్పగించారు. అనుమానితుల ఫోనులో తుపాకులు, బుల్లెట్లు, రాజాసింగ్ ఫొటో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. వీరిని ఇస్మాయిల్, మహమ్మద్ ఖాజాగా గుర్తించారు. రాజాసింగ్ హత్యకు ఏమైనా కుట్ర పన్నారా? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News September 29, 2024

HYD: దూరవిద్య కోర్సుల పరీక్ష తేదీల ఖరారు!

image

PGRRCDE ద్వారా అందించే వివిధ కోర్సుల పరీక్ష తేదీలను ఖరారు చేసినట్టు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొ. రాములు తెలిపారు. ఎంసీఏ మొదటి, మూడో సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలను వచ్చే నెల 5 నుంచి, పీజీడీసీఏ 1వ, 2వ సెమిస్టర్ బ్యాక్ లాగ్, అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ మొదటి సెమిస్టర్ మెయిన్ పరీక్షలను వచ్చే నెల 16 నుంచి నిర్వహిస్తామన్నారు. వివరాలకు www.osmania.ac.in లో చూడాలన్నారు.