News June 15, 2024

సికింద్రాబాద్: ఆలస్యంగా విశాఖ.. ప్రయాణికుల తిప్పలు!

image

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్లే విశాఖ రైలు పలుమార్లు ఆలస్యంగా రావడం పట్ల ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. విశాఖ రైలు సమయపాలన పాటించేలా రైల్వే అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేశారు. ఒక్కోసారి రెండు గంటలకు పైగా ఆలస్యం జరుగుతుందని, అలాంటివి మరోసారి పునరావృతం కాకుండా చూడాలని కోరారు.

Similar News

News November 18, 2025

HYD: జేఎన్టీయూలో వేడుకలు.. హాజరు కానున్న సీఎం

image

జేఎన్టీయూలో డైమండ్ జూబ్లీ, గ్లోబల్ అలుమ్నీ వేడుకలు 2 రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నారు. ఈనెల 21, 22 తేదీల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు వర్సిటీ అధికారులు ఏర్పాట్లు చేశారు. అట్టహాసంగా జరిగే ఈ ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని ప్రిన్సిపల్ డా.భ్రమర తెలిపారు. 21న సీఎం రేవంత్ రెడ్డి, 22న మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథులుగా హాజరు అవుతారని పేర్కొన్నారు.

News November 18, 2025

HYD: జేఎన్టీయూలో వేడుకలు.. హాజరు కానున్న సీఎం

image

జేఎన్టీయూలో డైమండ్ జూబ్లీ, గ్లోబల్ అలుమ్నీ వేడుకలు 2 రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నారు. ఈనెల 21, 22 తేదీల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు వర్సిటీ అధికారులు ఏర్పాట్లు చేశారు. అట్టహాసంగా జరిగే ఈ ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని ప్రిన్సిపల్ డా.భ్రమర తెలిపారు. 21న సీఎం రేవంత్ రెడ్డి, 22న మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథులుగా హాజరు అవుతారని పేర్కొన్నారు.

News November 18, 2025

హైదరాబాద్‌లో భారీగా స్థిరాస్తి విక్రయాలు

image

గ్రేటర్ HYDలో ఈ ఏడాది జులై నుంచి సెప్టెంబర్ నాటికి 17,658 స్థిరాస్తులు విక్రయించినట్లుగా స్థిరాస్తి కన్సల్టెంట్ ప్రాప్ టైగర్ సంస్థ వెల్లడించింది. గతేడాది ఇదే టైమ్‌లో జరిగిన విక్రయాలతో పోలిస్తే 53% ఎక్కువ అని వెల్లడించింది. హైదరాబాద్ తర్వాత గిరాకీ అధికంగా ఉన్న నగరాల్లో బెంగళూరు, చెన్నై ఉన్నట్లు పేర్కొంది.