News February 19, 2025
సికింద్రాబాద్: క్రీడలతో శారీరక దృఢత్వం: GM

రోజూ గంట పాటు వ్యాయామం, క్రీడలు ఆడితే శారీరక దృఢత్వం సొంతం చేసుకోవచ్చని సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద జరిగిన ఇండియన్ రైల్వే హాకీ మెన్ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించి, క్రీడాకారులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News September 17, 2025
మహానంది: భారీ వర్ష సూచన.. జాగ్రత్త అంటూ సందేశాలు!

‘ఈ రోజు మీ ప్రాంతంలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. చెట్లు, టవర్స్, పోల్స్, పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండకండి. అప్రమత్తంగా ఉండాలి’ అంటూ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ నంద్యాల జిల్లాలోని ప్రజల మొబైల్ ఫోన్లకు సందేశాలు పంపింది. ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై ఉండటంతో వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. పొలాలకు వెళ్లినవారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
News September 17, 2025
ఇప్పటికే అనేక రంగాల్లో GST ప్రయోజనాలు: నిర్మల

AP: 140కోట్ల మందికి వర్తించే GSTపై పెద్ద నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. GST కౌన్సిల్ నిర్ణయాలు ఈ నెల 22నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. ఇప్పటికే అనేక రంగాలు ప్రయోజనాలు పొందుతున్నాయని విశాఖలో GST సంస్కరణల సమావేశంలో తెలిపారు. ‘12శ్లాబ్లో ఉండే 99శాతం వస్తువులు 5% GST పరిధిలోకి తెచ్చాం. 28 శ్లాబ్లో ఉండే వస్తువులు దాదాపు 90శాతం 18% పరిధిలోకి వచ్చేశాయి’ అని వివరించారు.
News September 17, 2025
HYD: రోడ్లపై చెత్త వేస్తే ఒక్కో రకంగా జరిమానా

గ్రేటర్, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే జరిమానా విధిస్తామని అనేక చోట్ల బోర్డులు ఏర్పాటు చేశారు. అయినా.. ఫలితం లేకుండా పోతోంది. గ్రేటర్ పరిధిలో రోడ్లపై చెత్త వేస్తే రూ.1,000 జరిమానా వేస్తామని బోర్డులపై ఉండగా, అదే బోడుప్పల్ కార్పొరేషన్లలో రూ.25,000 జరిమాన వేస్తామని పేర్కొన్నారు. గ్రేటర్ కంటే కార్పొరేషన్లలోనే అధికంగా జరిమానా ఉన్నట్లు తెలుస్తోంది.