News August 18, 2024

సికింద్రాబాద్: పార్ట్ టైం జాబ్ అని రూ.8.62 లక్షలు లూటీ

image

కారు చిత్రాలపై స్వైప్ చేస్తే లాభాలు ఇస్తామంటూ నమ్మించి సైబర్ నేరగాళ్లు డబ్బు కాజేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. సికింద్రాబాద్‌కు చెందిన వ్యాపారికి ఆన్‌లైన్‌లో పార్ట్ టైం జాబ్ పేరుతో మెసేజ్ వచ్చింది. మొదటగా కారు చిత్రాలపై స్వైప్ చేస్తే లాభాలు ఇచ్చారు. తర్వాత పెట్టుబడి పెట్టాలని సూచించగా.. నమ్మిన బాధితుడు రూ.8.62 లక్షలు పెట్టేశారు. తర్వాత మోసపోయామని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Similar News

News November 21, 2025

HYD: లిటిల్ ఇంగ్లండ్ ఎక్కడో తెలుసా?

image

HYDలో ‘లిటిల్‌ ఇంగ్లండ్‌’గా పిలిచే ఓ ప్రాంతం ఉందని మీకు తెలుసా? ఈ ఏరియా ఆంగ్లో- ఇండియన్‌ నివాసస్థలాల ప్రధాన కేంద్రంగా ఉండేది. బ్రిటిష్‌ జీవనశైలి, ఇంగ్లిష్‌ సంప్రదాయాల స్పష్టమైన ముద్రతో ఈ ప్రాంతం ప్రత్యేక గుర్తింపును సంతరించుకుంది. వలస యుగపు సంస్కృతి ప్రతి వీధిలో ప్రతిధ్వనించేది. HYD సామాజిక రూపకల్పనలో ఓ ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది. అదే సౌత్ లాలాగూడ. అందుకే దీనిని ‘లిటిల్‌ ఇంగ్లండ్‌’గా పిలిచేవారు.

News November 21, 2025

HYD: లిటిల్ ఇంగ్లండ్ ఎక్కడో తెలుసా?

image

HYDలో ‘లిటిల్‌ ఇంగ్లండ్‌’గా పిలిచే ఓ ప్రాంతం ఉందని మీకు తెలుసా? ఈ ఏరియా ఆంగ్లో- ఇండియన్‌ నివాసస్థలాల ప్రధాన కేంద్రంగా ఉండేది. బ్రిటిష్‌ జీవనశైలి, ఇంగ్లిష్‌ సంప్రదాయాల స్పష్టమైన ముద్రతో ఈ ప్రాంతం ప్రత్యేక గుర్తింపును సంతరించుకుంది. వలస యుగపు సంస్కృతి ప్రతి వీధిలో ప్రతిధ్వనించేది. HYD సామాజిక రూపకల్పనలో ఓ ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది. అదే సౌత్ లాలాగూడ. అందుకే దీనిని ‘లిటిల్‌ ఇంగ్లండ్‌’గా పిలిచేవారు.

News November 21, 2025

యాదగిరిగుట్ట దేవస్థానంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఖాళీగా ఉన్న మతపర సేవా పోస్టుల భర్తీకి దేవాదాయశాఖ ఆదేశాలతో ఆలయ అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు. వేదపండితులు, పరిచారికలు, వాహన పురోహితులు తదితర ఉద్యోగాలకు 59 పోస్టులకు 18-46 ఏళ్లలోపు హిందువులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అర్హత పత్రాలతో DEC12 సా.5 లోపు దేవస్థానం వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.