News August 18, 2024
సికింద్రాబాద్: పార్ట్ టైం జాబ్ అని రూ.8.62 లక్షలు లూటీ

కారు చిత్రాలపై స్వైప్ చేస్తే లాభాలు ఇస్తామంటూ నమ్మించి సైబర్ నేరగాళ్లు డబ్బు కాజేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. సికింద్రాబాద్కు చెందిన వ్యాపారికి ఆన్లైన్లో పార్ట్ టైం జాబ్ పేరుతో మెసేజ్ వచ్చింది. మొదటగా కారు చిత్రాలపై స్వైప్ చేస్తే లాభాలు ఇచ్చారు. తర్వాత పెట్టుబడి పెట్టాలని సూచించగా.. నమ్మిన బాధితుడు రూ.8.62 లక్షలు పెట్టేశారు. తర్వాత మోసపోయామని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Similar News
News September 14, 2025
HYD: MSMEలకు ప్రభుత్వ ప్రోత్సాహం: మంత్రి

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యవస్థాపకులను (MSME) రాష్ట్ర ప్రభుత్వం ప్రొత్సహిస్తోందని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. బిజినెస్ నెట్వర్క్ఇంటర్నెషనల్ బీఎన్ఐ(BNI) ఆధ్వర్యంలో శంషాబాద్ ఎస్ఎస్ కన్వెన్షన్హాలులో ఏర్పాటు చేసిన MSME ఎక్స్పోను ప్రారంభించారు. పారాశ్రామికాభివృద్ధికి పక్కరాష్ట్రాల్లో ఉన్న పోర్టులనూ సద్వినియోగం చేసుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
News September 14, 2025
మిలాద్ ఉన్న నబీ ర్యాలీ.. HYDలో ట్రాఫిక్ ఆంక్షలు

మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు సందర్భంగా నేడు నగరంలోని పలు ప్రాంతాల్లో ఉ.8 నుంచి రా.8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఫలక్నుమా, ఇంజిన్బౌలి, నాగుల్ చింత X రోడ్, హరిబౌలి, చార్మినార్, గుల్జార్హౌస్, మదీనాజంక్షన్, మీరాలంమండీ, బీబీబజార్, అఫ్జల్గంజ్ టీ జంక్షన్, MJమార్కెట్ జంక్షన్, నాంపల్లి ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. పాతబస్తీలోని పర్యాటక ప్రాంతాలు మూసి ఉంటాయన్నారు.
News September 14, 2025
HYD: అంజన్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలపై మీ కామెంట్..?

ఇప్పుడు ఏ నోట విన్నా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ముచ్చట్లే వినిపిస్తున్నాయి. తాజాగా గాంధీభవన్లో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని తనకు అవకాశం ఇవ్వాలంటూ చిట్ చాట్ చేసినట్లు సమాచారం. తమ సామాజిక వర్గం నుంచి ఎవరూ కూడా మంత్రిగా లేరని, తనకంటే సీనియర్ ఎవరైనా జూబ్లీహిల్స్ నుంచి ఉంటే తాను టికెట్ అడగనంటూ చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలపై మీ కామెంట్?