News July 18, 2024

సికింద్రాబాద్: ప్లాట్‌ ఫాం, రైలు మధ్యలో ఇరుక్కుని వ్యక్తి మృతి

image

గుర్తు తెలియని వ్యక్తి రైలు, ప్లాట్ ఫామ్ మధ్య ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్లాట్ ఫామ్ నంబర్-3లో కాకతీయ ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కింద పడటంతో ప్లాట్ ఫాం, రైలు మధ్యలో ఇరుక్కుపోయి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News November 21, 2025

HYD: నాగోల్‌లో విషాదం.. దంపతుల సూసైడ్

image

నగరంలో విషాద ఘటన వెలుగుచూసింది. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్టి అన్నారం శివారులో దంపతులు సూసైడ్ చేసుకున్నారు. అప్పుల బాధతో మల్లేశ్, సంతోష పురుగుల మందు తాగారు. అక్కడికక్కడే భార్య మృతి చెందగా, గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భర్త చనిపోయారు. శుక్రవారం ఉదయం చైతన్యపురి పీఎస్‌లో వారి కుమారుడు ఇచ్చిన మిస్సింగ్ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

News November 21, 2025

HYD: నాగోల్‌లో విషాదం.. దంపతుల సూసైడ్

image

నగరంలో విషాద ఘటన వెలుగుచూసింది. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్టి అన్నారం శివారులో దంపతులు సూసైడ్ చేసుకున్నారు. అప్పుల బాధతో మల్లేశ్, సంతోష పురుగుల మందు తాగారు. అక్కడికక్కడే భార్య మృతి చెందగా, గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భర్త చనిపోయారు. శుక్రవారం ఉదయం చైతన్యపురి పీఎస్‌లో వారి కుమారుడు ఇచ్చిన మిస్సింగ్ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

News November 21, 2025

Skill Trainingలో సిటీ పోలీస్ బాస్

image

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆకస్మికంగా పేట్ల బురుజు, చేలపురా సిటీసీ శిక్షణా కేంద్రాలను సందర్శించారు. హోంగార్డు నుంచి ఎస్సై స్థాయి వరకు 350 మంది సిబ్బంది తీసుకుంటున్న శిక్షణను పరిశీలించారు. “ఒక గొప్ప మార్పునకు ఇదే శ్రీకారం” నైపుణ్యాభివృద్ధి శిక్షణ గురించి తెలుసుకున్నారు. ట్రైనింగ్ విధానంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రక్షిత కృష్ణమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.