News July 20, 2024

సికింద్రాబాద్ మహంకాళికి బోనం సమర్పించిన దీపాదాస్ మున్షీ

image

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ, యూఎస్ కన్సులేట్ జనరల్ జెన్నిఫర్ ఎ.లార్సన్, మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలిపారు. పార్టీ సనత్‌నగర్ ఇన్‌ఛార్జ్ కోట నీలిమ, నాయకులు పాల్గొన్నారు.

Similar News

News November 13, 2025

HYD: ఔర్‌కుచ్ బాకీ హే క్యా?.. BRS మీద INC ట్రోల్స్

image

జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్‌ కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపడంతో ఆ పార్టీ నాయకులు BRS మీద ట్రోల్స్ మొదలుపెట్టారు. ‘ఎవ్వడికి వాడు కొడుతున్నాం.. కొడుతున్నాం అన్నారు. అసెంబ్లీ ఎలక్షన్‌లో కొట్టాం. పార్లమెంట్ ఎలక్షన్స్‌‌లో కొట్టాం. కంటోన్మెంట్ బైఎలక్షన్‌లో కొట్టాం. జూబ్లీహిల్స్‌లో కొడుతున్నాం. ప్రతిసారి కొట్టేది మేము అయితే కొట్టించుకునేది మీరు’ అంటూ BRSను ఉద్దేశించి కాంగ్రెస్ నేతలు SMలో ట్వీట్ చేస్తున్నారు.

News November 13, 2025

జూబ్లీహిల్స్: రేపు వైన్స్ బంద్

image

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో రేపు ఉదయం నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలు బంద్ ఉంటాయని అధికారులు మరోసారి గుర్తు చేశారు. వైన్స్, బార్‌లు, కల్లు కంపౌండ్‌లు మూసివేయాలని ఆదేశించారు. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ ప్రక్రియ ఉన్నందున పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. కౌంటింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం వైన్స్ తెరుచుకోనున్నాయి. SHARE IT

News November 13, 2025

HYD: స్పాలో అమ్మాయిలతో అబ్బాయిలకు మసాజ్

image

డిఫెన్స్‌ కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న జెనోరా స్పా మసాజ్ సెంటర్‌పై నేరేడ్‌మెట్ పోలీసులు దాడులు చేశారు. ఈ స్పాలో నిబంధనలకు విరుద్ధంగా మహిళా థెరపిస్ట్‌లతో పురుషులకు క్రాస్ మసాజ్‌లు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. స్పా యజమాని, మేనేజర్‌పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అవసరమైన అనుమతులు లేకుండా నడిపినందుకు సంబంధిత పత్రాలు, సీసీ ఫుటేజ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.