News August 20, 2024
సికింద్రాబాద్: రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం: జూపల్లి

భారాస ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పులు, రూ. 40 వేల కోట్ల బకాయిలు మిగిల్చిందని.. అవి భారంగా మారినా కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ చేసి రైతుల పక్షాన నిలిచిందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తన కార్యాలయంలో మాట్లాడుతూ.. ‘నిబంధనల ప్రకారం స్పష్టంగా ఉన్న బ్యాంకు ఖాతాలకు వెంటనే రుణమాఫీ అమలు చేశాం. గత ప్రభుత్వం తప్పిదాల వల్ల ఆధార్, పాస్ పుస్తకాల సమాచారం గందరగోళంగా ఉంది’ అన్నారు.
Similar News
News December 9, 2025
HYD వాసులకు హెచ్చరిక.. డేంజర్లో పడుతున్నారు!

HYD వాసులకు హెచ్చరిక. సైబర్ మోసగాళ్ల కొత్త స్కామ్ బయటపడింది. APK యాప్ల ద్వారా అధిక వడ్డీ పేరిట వల వేస్తూ సైబర్ నేరాల నుంచి వచ్చిన డబ్బునే యాప్ యూజర్ల ఖాతాల్లోకి పంపుతున్నట్లు CCS పోలీసులు గుర్తించారు. రూ.40 వేలు పెట్టిన యూజర్లకు డబుల్ అమౌంట్ బదిలీ అయ్యింది. చివరకు అది సైబర్ క్రైమ్ మనీ అని తేలింది. ఇల్లీగల్ యాప్లు, APK ఫైల్స్ ఇన్స్టాల్ చేస్తే మీరు కూడా నేరంలో భాగం అవుతారు. జాగ్రత్త.
SHARE IT
News December 9, 2025
హైదరాబాద్లో కొత్త ట్రెండ్

హైదరాబాద్లోనూ ప్రస్తుతం ‘భజన్ క్లబ్బింగ్’ జోరుగా సాగుతోంది. ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ నైట్స్ స్థానంలో యువత ఎంచుకుంటున్న కొత్త ట్రెండ్ ఇది. ’మీనింగ్ఫుల్ పార్టీ’ అంటే ఇదే అంటున్నారు. ఆల్కహాల్ తీసుకోకుండా హై-ఎనర్జీ కీర్తనలు, భజన్ జామింగ్ సెషన్స్ లాంటి భక్తి పాటలతో ఎంజాయ్ చేస్తున్నారు. డిస్కో లైటింగ్, DJ నడుమ గ్రూప్ సింగింగ్తో మైమరిచిపోతున్నారు. ఈ ట్రెండ్పై మీ అభిప్రాయం ఏంటి?
News December 9, 2025
రాష్ట్ర ప్రభుత్వం, బంటియా ఫర్నిచర్స్ మధ్య ఒప్పందం

రాష్ట్ర ప్రభుత్వం, బంటియా ఫర్నిచర్స్ మధ్య అధికారికంగా ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో దీనికి సంబంధించి (MoU)పై ఇరువురు ప్రతినిధులు సంతకం చేశారు. అనంతరం కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ.. బంటియా ఫర్నిచర్స్ మరో మైలురాయిని ప్రకటించడానికి సంతోషంగా ఉందని చెప్పారు. రూ.511 కోట్ల విలువైన ఈ ముఖ్యమైన సహకారం రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని గణనీయంగా బలోపేతం చేయనుందని వెల్లడించారు.


