News April 4, 2025

సికింద్రాబాద్: రైలులో బాలికకు లైంగిక వేధింపులు

image

సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. రక్సెల్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ బాలిక అర్ధరాత్రి 2 గంటలకు వాష్ రూమ్‌కు వెళ్లింది. ఇది గమనించిన ఓ యువకుడు ఆమెను అనుసరించాడు. బాత్రూం వద్ద అరగంట సేపు ఆపి వీడియోలు తీసి, లైంగికంగా వేధించాడు. బాధితురాలు ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు రైల్వే టోల్‌ఫ్రీ నంబరు 139కి ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Similar News

News December 9, 2025

పార్వతీపురం: మంత్రి చుట్టూ రోజుకో వివాదం.. పూటకో రగడ

image

మంత్రి సంధ్యారాణి చుట్టూ రోజుకో వివాదం నడుస్తోంది. ఇటీవల పచ్చకామెర్లతో గురుకుల పాఠశాల విద్యార్థులు మృతి చెందడంతో మంత్రిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మంత్రి PA వేధిస్తున్నాడని సాలూరుకు చెందిన మహిళ పోలీసులుకి ఫిర్యాదు చేయడం కలకలం సృష్టించింది. తాజాగా తన తల్లి <<18505977>>మరణానికి<<>> మంత్రి అనుచరుడి వేధింపులే కారణమని ఓ మహిళ కలెక్టర్‌కి ఫిర్యాదు చేసింది. మంత్రి అనుచరుల వల్ల ఆమెకు చెడ్డపేరు వస్తోందని లోకల్ టాక్.

News December 9, 2025

తిరుపతి: అర్చకుల మధ్య వివాదం.. అందుకోసమేనా.?

image

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో అర్చకుల మధ్య <<18509949>>కోల్డ్‌వార్<<>> కాకరేపుతోంది. ఆలయంలో కొత్తగా నాలుగు పరిచారకుల పోస్టుల భర్తీ కానున్నాయి. వీటిని దక్కించుకోవాలని కొందరు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అనాధికారిక వ్యక్తులను పరిచారికులుగా చేర్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారట. మరి విజిలెన్స్ అధికారులు దీనిపై విచారణ చేశారా.. లేదా అన్నది తేలాల్సి ఉంది.

News December 9, 2025

25 మంది మృతి.. థాయ్‌లాండ్‌కి పరారైన ఓనర్లు

image

గోవాలోని ఓ నైట్‌క్లబ్‌లో జరిగిన <<18501326>>అగ్నిప్రమాదం<<>>లో 25 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఘటన తర్వాత క్లబ్ ఓనర్లు గౌరవ్, సౌరభ్ లూథ్రా థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌కు పరారైనట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రమాదం జరిగిన ఐదు గంటల్లోనే డిసెంబర్‌ 7న ఇండిగో విమానం 6E 1073లో వారు దేశం విడిచినట్లు వెల్లడైంది. వీరిద్దరిపై పోలీసులు FIR నమోదు చేశారు. ప్రస్తుతం ఇంటర్‌పోల్ సహాయంతో వారి అరెస్ట్‌కు చర్యలు చేపట్టారు.