News February 1, 2025
సికింద్రాబాద్ వారసిగూడ మహిళ మృతి కేసులో ట్విస్ట్

సికింద్రాబాద్ వారసిగూడ <<15327304>>మహిళ మృతి <<>>కేసులో ట్విస్ట్ నెలకొంది. ఈనెల 22న తల్లి లలిత చనిపోగా డిప్రెషన్కు గురైన ఇద్దరు కూతుళ్లు చనిపోదామనుకుని సూసైడ్ లెటర్ రాశారు. కాగా నిన్న విషయం బయటకు రావడంతో పోలీసులు ఘటనా స్థలంలో ఆ సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకున్నారు. అయితే తండ్రి రాజుతో ఇద్దరు కూతుళ్లకు గొడవ జరగగా ఐదేళ్లుగా ఆయన దూరం వెళ్లిపోయాడు. నాలుగేళ్లుగా మేనమామతోనూ వారికి గొడవ ఉందని స్థానికులు తెలిపారు.
Similar News
News March 14, 2025
బాలకృష్ణ ఇంటి ఫెన్సింగ్ను ఢీకొట్టిన కార్

HYDలోని జూబ్లీహిల్స్ రోడ్డు నెం.1లో నటుడు బాలకృష్ణ ఇంటి ముందున్న ఫుట్పాత్పైకి ఓ కారు దూసుకెళ్లింది. అతివేగంతో బాలకృష్ణ ఇంటి ముందున్న ఫెన్సింగ్ను కారు ఢీకొట్టింది. మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్డు నెం.45 మీదుగా చెక్ పోస్ట్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఫెన్సింగ్తో పాటు కారు ముందు భాగం ధ్వంసమైంది. కాగా.. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.
News March 14, 2025
HYD: హోలీ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత: సీపీ

35 ఏళ్ల తర్వాత ఒకే రోజు హోలీ, రంజాన్ మాసంలో రెండవ శుక్రవారం ఒకేరోజు రావడంతో HYD సీపీ సీవీ ఆనంద్ అధికారులను అప్రమత్తం చేశారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. ప్రతీ జోన్, సున్నితమైన ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేయాలని, అసాంఘిక శక్తులపై కట్టుదిట్టమైన నిఘా పెట్టాలని అధికారులకు ఆదేశించారు. అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, డీసీపీ చైతన్య కుమార్ పాల్గొన్నారు.
News March 14, 2025
జిల్లాలో కొనసాగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు

రంగారెడ్డి జిల్లాలో ఎండ మండిపోతుంది. గురువారం కొత్తూర్, చందనవెల్లిలో 39.8℃, షాబాద్, మహేశ్వరం, ప్రొద్దుటూరు 39.7, మహంకాళ్, రెడ్డిపల్లె 39.6, చుక్కాపూర్, కేతిరెడ్డిపల్లి 39.5, తాళ్లపల్లి 39.4, మణికొండ 39.3, మొగల్గిద్ద, తోమ్మిడిరేకుల, మంగళ్పల్లి 39.3, పెద్దఅంబర్పేట్, మొయినాబాద్, మామిడిపల్లె, అబ్దుల్లాపూర్మెట్, తట్టిఅన్నారం 39.2, ధర్మసాగర్, ఆరుట్లలో 39.1℃ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.