News February 1, 2025

సికింద్రాబాద్ వారసిగూడ మహిళ మృతి కేసులో ట్విస్ట్

image

సికింద్రాబాద్ వారసిగూడ <<15327304>>మహిళ మృతి<<>> కేసులో ట్విస్ట్ నెలకొంది. ఈనెల 22న తల్లి లలిత చనిపోగా డిప్రెషన్‌కు గురైన ఇద్దరు కూతుళ్లు చనిపోదామనుకుని సూసైడ్ లెటర్ రాశారు. కాగా నిన్న విషయం బయటకు రావడంతో పోలీసులు ఘటనా స్థలంలో ఆ సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకున్నారు. అయితే తండ్రి రాజుతో ఇద్దరు కూతుళ్లకు గొడవ జరగగా ఐదేళ్లుగా ఆయన దూరం వెళ్లిపోయాడు. నాలుగేళ్లుగా మేనమామతోనూ వారికి గొడవ ఉందని స్థానికులు తెలిపారు.

Similar News

News December 1, 2025

వేములవాడ(R) మండలంలో 34 వార్డులు ఏకగ్రీవం

image

వేములవాడ రూరల్ మండలంలో 34 వార్డుల సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయింది. మండలంలోని మొత్తం 17 గ్రామపంచాయతీలకు సంబంధించి 146 వార్డులలో 34 వార్డుల్లో సింగిల్ నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. దీంతో జయవరంలో 7, అచ్చన్నపల్లి 5, బొల్లారం 3, చెక్కపల్లి 2, ఫాజుల్ నగర్ 4, మల్లారం 1, నాగయ్యపల్లి 1, నమిలిగుండుపల్లి 1, తుర్కాశినగర్ 5, వెంకటంపల్లిలో 5 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.

News December 1, 2025

HYD: విమానంలో మహిళా సిబ్బందికి లైంగిక వేధింపులు

image

దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో మహిళా క్యాబిన్ సిబ్బందిని ఓ ప్రయాణికుడు లైంగికంగా వేధించాడు. విమానం హైదరాబాద్ చేరుకోగానే RGIA పోలీసులు కేరళకు చెందిన ఆ ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు. యువతి ఫిర్యాదు మేరకు, లైంగిక వేధింపులు, దాడికి సంబంధించిన BNS సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 1, 2025

ఒకే పోస్టులో ఇద్దరు TTD ఉద్యోగులు

image

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఇద్దరు సూపరింటెండెంట్లు ఉంటారు. ఇందులో ఓ పోస్టు ఏడాదిగా ఖాళీగా ఉంది. ఇటీవల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో డిప్యుటేషన్‌పై సురేష్ బాబుకు పోస్టింగ్ ఇచ్చారు. 2రోజులు క్రితం మునిచెంగల్ రాయులకు సూపరింటెండెంట్‌గా ఇవ్వడంతో ఇద్దరు ఏ పని చేయాలో తెలియలేదు. డిప్యూటీ ఈవో సెలవుపై ఉండడంతో ఈ సమస్య నెలకొంది. ఆయన సెలవుపై వచ్చాక ఎవరికి ఏ విధులు అనేది క్లారిటీ వస్తుంది.