News February 1, 2025
సికింద్రాబాద్ వారసిగూడ మహిళ మృతి కేసులో ట్విస్ట్

సికింద్రాబాద్ వారసిగూడ <<15327304>>మహిళ మృతి<<>> కేసులో ట్విస్ట్ నెలకొంది. ఈనెల 22న తల్లి లలిత చనిపోగా డిప్రెషన్కు గురైన ఇద్దరు కూతుళ్లు చనిపోదామనుకుని సూసైడ్ లెటర్ రాశారు. కాగా నిన్న విషయం బయటకు రావడంతో పోలీసులు ఘటనా స్థలంలో ఆ సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకున్నారు. అయితే తండ్రి రాజుతో ఇద్దరు కూతుళ్లకు గొడవ జరగగా ఐదేళ్లుగా ఆయన దూరం వెళ్లిపోయాడు. నాలుగేళ్లుగా మేనమామతోనూ వారికి గొడవ ఉందని స్థానికులు తెలిపారు.
Similar News
News October 29, 2025
HYD: తెలుగు వర్సిటీ.. నేడు సాహితీ పురస్కారాల ప్రదానం

బాచుపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీలో 2023 సంవత్సరానికి గాను సాహితీ పురస్కారాలకు 11 మంది ఎంపికైనట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు తెలిపారు. ఈనెల 29న నాంపల్లి ప్రాంగణంలో ఈ పురస్కారాలు ప్రదానం చేస్తామని, పురస్కారాల గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.20,116 నగదు అందజేసి సత్కరిస్తామన్నారు. 2020, 2021, 2022 సంవత్సరాల్లో వెలువడ్డ పుస్తకాలను సేకరించి పురస్కారాల ఎంపిక చేశామన్నారు.
News October 29, 2025
KNR: అమ్మాయిలపై లైంగిక దాడి చేసింది ‘వీడే’..!

గంగాధర ZPHS ఘటనలో అటెండర్ యాకుబ్ను పోలీసులు రేకుర్తి చౌరస్తా వద్ద నిన్న అరెస్ట్ చేశారు. అయితే విద్యార్థినులపై లైంగికదాడి జరిగిందని <<18128528>>స్వయంగా CP<<>>నే చెప్పడం ఆడపిల్లల పేరెంట్స్ను ఆందోళన కలిగిస్తోంది. అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా.. చదువుకునేందుకు అన్ని వసతులున్నా ఏకంగా ప్రభుత్వ పాఠశాలల్లోనే యాకుబ్ లాంటి కామాంధులుంటే పేదింటి ఆడబిడ్డలు చదువుకోవాలంటేనే భయపడాల్సిన దుస్థితి ఏర్పడింది.
News October 29, 2025
తుఫాన్ ఎఫెక్ట్.. సదాశివనగర్లో అత్యధికం

కామారెడ్డి జిల్లాలో మొంథా ప్రభావంతో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. సదాశివనగర్లో 30 మి.మీ వర్షపాతం నమోదు కాగా జుక్కల్లో 26.3, రామారెడ్డి 18, తాడ్వాయి 16.3, సోమూర్ 16, IDOC (కామారెడ్డి) 14.5, గాంధారి 13.8, నాగిరెడ్డి పేట 12.5, లింగంపేట 12.3, రామ లక్ష్మణపల్లి 9, పిట్లం 8.8, డోంగ్లి 8.3, పెద్ద కొడప్గల్ 7.3, సర్వాపూర్ 7మి.మీలుగా నమోదైంది.


