News April 25, 2024

సికింద్రాబాద్: సమ్మర్ స్పెషల్ ట్రైన్ల పొడిగింపు..!

image

సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వేసవి వేళ రద్దీని దృష్టిలో పెట్టుకుని సమర్ స్పెషల్ ట్రైన్లను పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. సికింద్రాబాద్, ఉదయ్‌పూర్ ఏప్రిల్ 30 నుంచి జూన్ 25 వరకు ప్రతి మంగళవారం, హైదరాబాద్, కటక్ మే 7 నుంచి జూన్ 25 వరకు ప్రతి మంగళవారం సేవలు అందిస్తుందని SCR అధికారులు వెల్లడించారు.

Similar News

News October 14, 2025

రంగారెడ్డి జిల్లా ప్రజావాణికి 48 ఫిర్యాదులు

image

RR జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 48 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ నారాయణ రెడ్డికి విన్నవిస్తూ అర్జీలు ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ-15, ఇతర శాఖలు-33, మొత్తం 48 దరఖాస్తులు అందాయన్నారు. అనంతరం అందించే వినతులను సంబంధిత శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.

News October 12, 2025

RR: ఒక్క రోజు పిల్లల కోసం కేటాయించండి

image

పోలీయో.. బాడీలో ఏంజరుగుతుందో తెలిసేలోపే అంతా అయిపోతుంది. అంగవైఖల్యం పిల్లల జీవితాన్ని చిదిమేస్తుంది. 2 చుక్కలతో నిండు జీవితాన్ని మహమ్మారి నుంచి రక్షించండి. పనులు పక్కనబెట్టి నేడు ఉ.7గం.నుంచి పోలీయోడ్రాప్స్ వేయించండి. జిల్లాలోని అంగన్వాడీలు, ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులతో సహా 1,151 చోట్ల బూతులు ఏర్పాటుచేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 4,20,911మంది బాలలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

News October 11, 2025

సోమవారం నుంచి మళ్లీ యథావిధిగా ప్రజావాణి

image

స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించినందున రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయి. కావున రద్దుపరిచిన ప్రజావాణి కార్యక్రమాన్ని యధావిధిగా సోమవారం నుంచి కొనసాగించడం జరుగుతుందని RR జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు, ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు.