News August 17, 2024

సికింద్రాబాద్: 19, 20న ఎనిమిది ప్రత్యేక రైళ్లు

image

పంద్రాగస్టు, వారాంతపు సెలవుల నేపథ్యంలో ఈనెల 19, 20న మరో ఎనిమిది ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్- నర్సాపూర్ మార్గంలో 2, కాచిగూడ-తిరుపతి మార్గంలో 2, సికింద్రాబాద్- కాకినాడ టౌన్ మార్గంలో 4 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు పీఆర్వో శ్రీధర్ తెలిపారు. సికింద్రాబాద్ నుంచి బయల్దేరే ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, నడికుడి, గుంటూరు, విజయవాడ మీదుగా నడుస్తాయని వెల్లడించారు.

Similar News

News January 10, 2026

HYD: DANGER.. చిన్నపిల్లలకు ఈ సిరప్‌ వాడొద్దు

image

చిన్నపిల్లలకు ఇచ్చే ‘అల్మాంట్‌-కిడ్‌’ సిరప్‌ విషయంలో రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) కీలక హెచ్చరిక జారీ చేసింది. బిహార్‌కు చెందిన ట్రైడస్ రెమెడీస్ ఉత్పత్తి చేసిన ఈ మందులో (బ్యాచ్: AL-24002) ప్రాణాంతకమైన ‘ఇథిలీన్ గ్లైకాల్’ రసాయనం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజల వద్ద ఈ బ్యాచ్ సిరప్ ఉంటే వెంటనే 1800-599-6969 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. దీన్ని తక్షణమే వాడకం నిలిపివేయాలన్నారు.

News January 10, 2026

HYD: తెలుగు రాష్ట్రాల్లో ఏకైక అద్భుత ఆలయం

image

చారిత్రక నేపథ్యం ఉన్న ఘట్‌కేసర్ (M) ఏదులాబాద్‌లోని మన్నారు గోదాదేవి సమేత రంగనాథస్వామి దేవాలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. TG,APలో ఏకైక ఆలయంగా ప్రఖ్యాతిగాంచింది. ఈఆలయానికి 600 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పలదేశికుడికి ఆండాళ్ దేవికలలో దర్శనమిచ్చి ఆలయ నిర్మాణానికి ఆదేశించింది. జమీందారుల విరాళాలతో గుడి నిర్మాణం సాధ్యమైంది. సంతానప్రదాయినిగా గాజులమ్మను కొలుస్తారు. నాగుల పంచమినాడు మట్టిగాజులు సమర్పిస్తారు.

News January 10, 2026

HYD: మాదాపూర్‌లో విషాదం.. యువకుడి ఆత్మహత్య

image

ఆర్థిక సమస్యలు తాళలేక ఓ యువ ఆర్కిటెక్ట్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కరీంనగర్‌కు చెందిన అనుదీప్ ఓ ప్రైవేట్ సంస్థలో ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.