News June 6, 2024
సిక్కోలులో పనసకు గిరాకీ తెచ్చిన ఒడిశా సంస్కృతి

శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో ఈ ఏడాది పనస పంట దిగుబడి పెరిగడంతో ఇఛ్చాపురంలో విక్రయాలు జోరందుకున్నాయి. అధిక విక్రయాలకు దిగుబడి పెరగడం ఓ కారణమైతే ఒడిశా సంస్కృతి ప్రదాన కారణం. అదేంటంటే గురువారం ఒడిశా, ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల్లో అంబ అమావాస్య, సావిత్రి అమావాస్య సందర్భంగా పెళ్ళైన ఆడపిల్లలకు పనస పండ్లు కానుకగా ఇవ్వడం ఆనవాయితీ. దీంతో ఉద్దానం ప్రాంతంలో విక్రయాలు మరింత జోరందుకున్నాయి.
Similar News
News July 10, 2025
మెళియాపుట్టి: విద్యుత్ షాక్తో విద్యార్థి మృతి

మెళియాపుట్టి మండలం గొప్పిలిలో గురువారం సాయంత్రం విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 5వ తరగతి విద్యార్థి మహేష్ (9) తన ఇంటి మేడపై మొక్కను నాటేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి షాక్కు గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. విగతజీవిగా పడిన ఉన్న బాలుడుని కుటుంబీకులు ఆస్పుత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు చెప్పారు.
News July 10, 2025
కళింగపట్నంలో నిర్మాణ పనులను పరిశీలించిన రామ్మెాహన్

ఎత్తిపోతల పథకం పనులు త్వరగతిన పూర్తి చేయాలని కేంద్ర పౌరవిమానాయన శాఖమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. వంశధార నదిలో నిర్మాణం జరుగుతున్న కళింగపట్నం వమరవెల్లి ఎత్తిపోతల పథకం పనులను గురువారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ పథకంతో ఎంతోమంది రైతులకు ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటి వరకు జరిగిన పనులు స్థితిగతులను ఎమ్మెల్యే గొండు శంకర్ను అడిగి తెలుసుకున్నారు.
News July 10, 2025
శ్రీకాకుళంలో నేడు ఉద్యోగ మేళా..!

శ్రీకాకుళంలోని బలగ గవర్నమెంట్ ఐటిఐలో గురువారం జాబ్ మేళా నిర్వహించనున్నారు. మేళాలో హైదరాబాద్ హెటిరో డ్రగ్స్ ఫార్మాసిటికల్ కంపెనీలో వివిధ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు కాలేజీ అసిస్టెంట్ డైరెక్టర్ రామ్మోహన్ రావు తెలిపారు. ఇంటర్, డిప్లొమా మెకానికల్, ఐటిఐ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎంఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ కెమిస్ట్రీ, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన వారు కళాశాలలో హాజరవ్వాలన్నారు.