News January 30, 2025

సిక్కోలు వాకిట.. జాతీ పిత మందిరం

image

శ్రీకాకుళం నగరంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న నగరపాలక సంస్థ పార్క్‌లో మహాత్మాగాంధీ మందిరంతో పాటు స్వాతంత్య్ర సమరయోధుల స్మృతివనం ఉంది. ఇక్కడ ధాన్యముద్రలో ఉన్న గాంధీజీ విగ్రహం, మందిరం నాలుగువైపులా గాంధీ జీవితంలోని పలు ఘట్టాలను తెలియజేసేలా చిత్రాలు దర్శనమిస్తాయి. వనం చుట్టూ 40 మంది స్వాతంత్య్ర సమరయోధులు, సంఘ సంస్కర్తల విగ్రహాలను ఉంటాయి. 105 అడుగుల జాతీయ జెండా రెపరెపలాడుతూ పార్క్ మధ్యలో ఉంటుంది.

Similar News

News February 9, 2025

‘తండేల్’ సినిమాలో మూలపేట మహిళ

image

ఇటీవల విడుదలైన ‘తండేల్’ సినిమాలో నటించే అరుదైన అవకాశం మూలపేటకు చెందిన రాజ్యలక్ష్మి (రాజి)కి దక్కింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం సముద్ర తీర ప్రాంతమైన మూలపేట గ్రామానికి చెందిన ఆమె, ఇంతకుముందు పలు సీరియల్, సినిమాల్లో నటించారు. కూలీ నిమిత్తం వెళ్లి పాకిస్థాన్ జైల్లో ఉంటున్న వ్యక్తి భార్యగా, ఆమె మత్స్యకార మహిళ పాత్రలో ‘తండేల్’ సినిమాలో నటించడం విశేషం.

News February 9, 2025

కోటబొమ్మాళి: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ సంతబొమ్మాళికి చెందిన రామారావు శనివారం కన్నుమూశారు. ఎస్సై వెంకటేశ్వరరావు కథనం..అతను జనవరి 28న భార్యను మద్యం తాగేందుకు డబ్బులు అడగగా .. మందలించిందని విషం తాగాడు. గమనించిన రామారావు కుమారుడు కుటుంబీకులకు సమాచారమిచ్చి ఆసుపత్రిలో చేర్చారు. కాగా చికిత్స పొందుతూ కోలుకోలేక శనివారం మృతిచెందారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

News February 9, 2025

శ్రీకాకుళం: తాను చనిపోతూ చూపునిచ్చాడు

image

శ్రీకాకుళం పట్టణం బ్యాంకర్స్ కాలనీలో నివాసం ఉంటున్న బురిడి ముఖలింగం (75) శనివారం మృతి చెందారు. అతని నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకుని రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ జగన్మోహన్ రావుకు తెలిపారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రానికి చెందిన ఐ టెక్నీషియన్ సుజాత, జగదీశ్, పవన్ అతని కార్నియాలు సేకరించారు. విశాఖపట్నం ఎల్.వి నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు.

error: Content is protected !!