News April 5, 2025
సిద్దవటం: బావిలో ఈతకొడుతూ ఫిట్స్.. విద్యార్థి మృతి

సిద్దవటం మండలంలోని ముమ్మడిగుంటపల్లిలో శనివారం విషాదం నెలకొంది. గ్రామస్థుల వివరాల ప్రకారం వ్యవసాయ పొలాల్లోని బావిలో శనివారం ఈతకొడుతూ 10వ తరగతి విద్యార్థి తమ్మిశెట్టి శ్రీనివాసులు మృతి చెందాడు. ఒంటిమిట్ట మండలం చిన్న కొత్తపల్లికి చెందిన తమ్మిశెట్టి శ్రీనివాసులు స్నేహితులతో కలిసి ముమ్మడిగుంటపల్లి వ్యవసాయ పొలాల్లోని బావిలో ఈతకొడుతూ బయటకు రాగానే ఫిట్స్ వచ్చి మృతిచెందినట్లు బంధువులు తెలిపారు.
Similar News
News January 5, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

ప్రొద్దుటూరులో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు:
* బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.14,050
* బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.12,926
* వెండి 10 గ్రాముల ధర: రూ.2450.
News January 4, 2026
కడప జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల బోధనేతర సిబ్బంది అధ్యక్షుడు ఈయనే.!

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల కడప జిల్లా భోధనేతర సిబ్బంది అధ్యక్షుడిగా హరిప్రసాద్ ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా శేఖర్, ట్రెజరర్గా రాజేశ్ కుమార్, అసోసియేట్ అధ్యక్షుడిగా ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా గంగాధర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలలోని బోధ నేతర సిబ్బంది సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.
News January 4, 2026
జాతీయస్థాయి అండర్-14 వాలీబాల్ పోటీలు.. ఏపీ టీం ఇదే.!

69వ జాతీయస్థాయి అండర్-14 బాలికల వాలీబాల్ పోటీలు జమ్మలమడుగులో రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో ఏపీ టీం ఇదే.!
C. నవీన, R. మనస్వి, Y. నందిని, K. శ్యామలాదేవి, అవంతి, V. జాస్మిన్, P. లాస్య, M. అశ్వని, K. జెసికా, V. వందన, K. తేజస్వి, J. నాగూర్బి. కోచ్ ఎం. దేవిక, మేనేజర్గా బీవీ రమణయ్య వ్యవహరించనున్నారు. ఈ పోటీలకు జమ్మలమడుగులోని బాలికల ఇంటర్ కాలేజీ ఆతిథ్యం ఇవ్వనుంది.
>> ALL THE BEST TEAM AP


