News March 8, 2025

సిద్దిపేట: అక్క చెల్లెళ్లు అదుర్స్.. అంతా డాక్టర్స్

image

ఒక సామాన్య కుటుంబానికి చెందిన నలుగురు అక్కాచెల్లెళ్లు MBBS చదువుతూ అందరి మన్ననలు పొందుతున్నారు. వివరాలు.. సిద్దిపేటలోని నర్సాపూర్‌కు చెందిన కొంక రామచంద్రం (టైలరింగ్) శారద దంపతులకు నలుగురు కుమార్తెలు మమత, మాధురి, రోహిణి, రోషిణి ఉన్నారు. వారిలో పెద్ద కూతురు మమత 2018-24లో MBBS పూర్తి చేయగా ఆమె చెల్లెళ్లు అదే బాట పట్టారు. మాధురి ఫైనల్ ఇయర్, రోహిణి ఫస్ట్ ఇయర్ చదువుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Similar News

News December 22, 2025

రెండో పెళ్లిపై మారుతున్న దృక్పథం

image

భారతీయుల్లో రెండో పెళ్లిపై అభిప్రాయాలు వేగంగా మారుతున్నాయి. రీబౌన్స్ మ్యాచ్‌మేకింగ్ యాప్ నిర్వహించిన తాజా సర్వేలో విడాకులు తీసుకున్న వారిలో 28% మంది మళ్లీ పెళ్లికి సిద్ధమని వెల్లడించారు. గతం తమ భవిష్యత్తును డిసైడ్‌ చేయకూడదని వారు భావిస్తున్నారు. ఈ మార్పులో మహిళలే ముందుండటం గమనార్హం. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఈ ఆలోచనా ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. సమాజంలో మారుతున్న ఈ ఆలోచనా విధానంపై మీ Comment?

News December 22, 2025

ఏర్పేడు: ముగిసిన ఇంటర్ స్పోర్ట్స్ మీట్.!

image

తిరుపతి IIT వేదికగా జరుగుతున్న 58వ ఇంటర్ స్పోర్ట్స్ మీట్ ఆదివారంతో ముగిసింది. ఐఐటీ మద్రాస్ కార్పొరేట్ రిలేషన్స్ డీన్ అశ్విన్ మహాలింగం అతిథిగా హాజరయ్యారు. విజేతలు వీరే:
> చెస్ విజేత : IIT బాంబే రన్నర్ : మద్రాస్
> మహిళల టెన్నిస్ విజేత : IIT మద్రాస్ రన్నర్ : ఢిల్లీ
> పురుషుల టెన్నిస్ విజేత : IIT మద్రాస్ రన్నర్ : కాన్పూర్
> వెయిట్ లిఫ్టింగ్టీం ఛాంపియన్ : IIT రూర్కీ.

News December 22, 2025

తిరుపతి: ‘కరంటోళ్ల జనబాట’కు ఏపీఎస్పీడీసీఎల్ శ్రీకారం

image

ఏపీఎస్పీడీసీఎల్ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా సీఎండీ శివశంకర్ ‘కరంటోళ్ల జనబాట’ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈనెల 22వ తేదీన పాకాల మండలంలో మంత్రి రవికుమార్ దీనిని ప్రారంభించనున్నారు. విద్యుత్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.