News March 8, 2025
సిద్దిపేట: అక్క చెల్లెళ్లు అదుర్స్.. అంతా డాక్టర్స్

ఒక సామాన్య కుటుంబానికి చెందిన నలుగురు అక్కాచెల్లెళ్లు MBBS చదువుతూ అందరి మన్ననలు పొందుతున్నారు. వివరాలు.. సిద్దిపేటలోని నర్సాపూర్కు చెందిన కొంక రామచంద్రం (టైలరింగ్) శారద దంపతులకు నలుగురు కుమార్తెలు మమత, మాధురి, రోహిణి, రోషిణి ఉన్నారు. వారిలో పెద్ద కూతురు మమత 2018-24లో MBBS పూర్తి చేయగా ఆమె చెల్లెళ్లు అదే బాట పట్టారు. మాధురి ఫైనల్ ఇయర్, రోహిణి ఫస్ట్ ఇయర్ చదువుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
Similar News
News March 13, 2026
40ల్లో ఈ తప్పులు చేయకండి!

రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే 40-50ఏళ్ల మధ్య తీసుకునే ఆర్థిక నిర్ణయాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఆ ఏజ్లో జాబ్ మారేటప్పుడు PF విత్డ్రా చేయొద్దని, తొందరపడి ఒకటి కంటే ఎక్కువ ప్రాపర్టీలు కొనొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ద్రవ్యోల్బణం ప్రభావం లేని అసెట్స్లో ఇన్వెస్ట్ చేయాలని, మల్టిపుల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటున్నారు. ఏటా మీ పోర్ట్ఫోలియో చెక్ చేసుకొని సవరించుకోవాలని చెబుతున్నారు.
News March 13, 2026
NLG: అక్రమ గ్యాస్ వినియోగంపై ఉక్కుపాదం

జిల్లాలో డొమెస్టిక్(వంట గ్యాస్) సిలిండర్లను అక్రమంగా వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్న వారిపై పౌర సరఫరాల శాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి పి.వెంకటేష్ ఆదేశాల మేరకు సివిల్ సప్లయ్స్ ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్ అధికారులు గురువారం నల్గొండతో పాటు మల్లేపల్లి గ్రామాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించారు. మొత్తం 68 సిలిండర్లను సీజ్ చేశారు.
News March 13, 2026
చెరువుగట్టు రామలింగేశ్వరుడికి భారీ ఆదాయం

చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం నిర్వహించిన వివిధ వేలం పాటలు గుడికి రికార్డు స్థాయి ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. మొత్తం ఐదు విభాగాల్లో నిర్వహించిన ఈ టెండర్ల ద్వారా దేవస్థానానికి రూ.50,22,887 ఆదాయం సమకూరినట్లు EO సల్వాది మోహన్ బాబు తెలిపారు. గతేడాదితో పోల్చితే ఈసారి వేలం పాటల్లో గణనీయమైన పెరుగుదల కనిపించింది. ఈ ఏడాది రూ.13 లక్షలకుపైగా అదనపు ఆదాయం లభించింది.


