News January 30, 2025
సిద్దిపేట: అఘోరీపై కేసు నమోదు

కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయంలో అఘోరీ హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. కత్తులతో భక్తులపై దాడి చేయడంతో అక్కడ ఉన్న భక్తులు భయందోళనకు గురయ్యారు. అనంతరం ఆలయ సభ్యులు అఘోరీకి దర్శనం చేయించి పంపించినా.. భక్తులపై కత్తితో దాడి చేయడంపై సిద్దిపేట సీపీ అనురాధ సీరియస్ అయ్యారు. సీపీ ఆదేశాలతో బుధవారం అఘోరీపై చేర్యాల పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News December 1, 2025
హైదరాబాద్లో 45 పోస్టులకు నోటిఫికేషన్

HYD సనత్నగర్లోని <
News December 1, 2025
HYD: ఇక పర్యాటక రంగానికి ఏఐ సేవలు

రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. దీంట్లో భాగంగా ఏఐ సహాయంతో టూరిస్టులను ఆకర్షించే ప్రయత్నాలు మొదలయ్యాయి. టూరిస్టులు చూసే ప్రదేశాలు సమయం చెప్తే దానికి తగ్గట్టుగా వారి ప్రయాణాన్ని నిర్ణయిస్తుంది. దక్కన్ ఎక్స్ప్లోరర్ తన కార్డుతో ఈ సేవలను అందించడానికి రూపకల్పన చేస్తున్నారు. అలాగే నగరంలోని వివిధ ప్రాంతాల్లో నైట్ టూరిజంను పెంచేందుకు చూస్తోంది.
News December 1, 2025
ములుగు: వాళ్లెందుకో వెనుకబడ్డారు..!

జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎక్కడో వెనకబడిందా..!? అనే సందేహాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కూడా ఆపార్టీ నేతలు ప్రభావవంతంగా పని చేయడం లేదనే విమర్శలున్నాయి. జిల్లా అధ్యక్షుడు/ నియోజకవర్గ ఇన్ఛార్జి మధ్య విబేధాలే కారణంగా తెలుస్తోంది. ఓ నేతకు ఆర్థిక సమస్య ఇబ్బందిగా మారిందని కేడర్ గుసగుసలాడుతోంది.


