News March 27, 2025

సిద్దిపేట: అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు వద్దు: CP

image

జిల్లాలో అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు చేపట్టవద్దని సిద్దిపేట సీపీ డాక్టర్ బి.అనురాధ సూచించారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 29 నుంచి వచ్చే నెల 13 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని తెలిపారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, బహిరంగ సభలు, ధర్నాలు చేపట్టవద్దన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News March 2, 2026

ఖమేనీ చనిపోతే భారత్‌లో ఆందోళనలు ఎందుకు?

image

ముస్లింలలో సున్నీ, షియా శాఖలు ఉంటాయి. ప్రపంచంలో మొత్తం ముస్లిం జనాభాలో షియాలు 10-15% ఉంటారు. అందులో ఎక్కువ మంది ఇరాన్‌లోనే నివసిస్తున్నారు. ‘అయతుల్లా’ అనేది మత గురువు హోదా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న షియాలు ‘అయతుల్లా’ను ఆధ్యాత్మిక గురువుగా, మతపెద్దగా భావిస్తారు. ఇజ్రాయెల్-అమెరికా కలిసి అయతుల్లా అలీ హొస్సేనీ ఖమేనీని చంపడంతో ఆ దేశాలకు వ్యతిరేకంగా షియాలు <<19279240>>నిరసనలు<<>> చేస్తున్నారు.

News March 2, 2026

పోలీస్ పీజీఆర్ఎస్‌లో 31 అర్జీలు: ఎస్పీ నర్సింహ కిషోర్

image

రాజమండ్రి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పీజిఆర్ఎస్ జరిగింది. ఎస్పీ డి.నరసింహ కిషోర్ అధికారులతో కలిసి బాధితుల నుంచి 31 అర్జీలను స్వీకరించారు. కిషోర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమం బాధితులకు ఎంతో తోడ్పాటును అందిస్తోందన్నారు. వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు.

News March 2, 2026

గల్ఫ్‌లో గురితప్పిన అమెరికా ‘రక్షణ కవచం’?

image

తమ గడ్డపై ఉన్న US బేస్‌లు రక్షణ కంటే ముప్పుగానే మారుతున్నాయనే చర్చ గల్ఫ్ దేశాల్లో మొదలైంది. తాజాగా ఇరాన్ జరిపిన దాడులను US అడ్డుకోలేకపోగా.. కీలక స్థావరాలు ఇరాన్ అటాక్స్‌కు లక్ష్యంగా మారాయి. UAE, కువైట్‌, ఖతర్‌లపై దాడులే దీనికి నిదర్శనం. దీంతో తమ భూభాగాలను ఇతరుల ప్రతీకార వేదికలుగా మార్చొద్దని UAE పరోక్షంగా అమెరికాను కోరడం గమనార్హం.