News April 3, 2025
సిద్దిపేట: అనుమనాస్పదంగా వృద్ధ దంపతుల మృతి

సిద్దిపేట జిల్లా నంగునూరు వృద్ధ దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. నంగునూరుకు చెందిన దంపతులు ఆవుల కొమురయ్య(80), బూదవ్వ(75) గ్రామం సమీపంలో అక్కెనపల్లికి వెళ్లే దారిలోని వారి వ్యవసాయ క్షేత్రంలోని పౌల్ట్రీ ఫారం లోని గదిలో ఏడాదిగా ఉంటున్నారు. ఇవాళ ఇంటికి వెళ్లిన కొడుకుకి వృద్ధ దంపతులు చనిపోయి కనిపించారు. ఈ ఘటన నంగునూరులో కలకలం రేపింది. పోలీసులు విచారణ చేపట్టారు.
Similar News
News April 18, 2025
IPL: CSKలోకి బేబీ ABD?

సౌతాఫ్రికా క్రికెటర్ డెవాల్డ్ బ్రెవిస్ ఇన్స్టాలో యెల్లో కలర్ ఇమేజ్ను పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. అతడు IPLలో CSK జట్టులో చేరనున్నారా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఇప్పటికే పలువురు CSK అభిమానులు సోషల్ మీడియా వేదికగా బ్రెవిస్కు స్వాగతం చెబుతున్నారు. అయితే అతడు నిజంగానే CSKలో చేరుతారా? మరేదైనా విషయమా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. బేబీ ఏబీగా పాపులరైన బ్రెవిస్ గతంలో MIకి ఆడారు.
News April 18, 2025
గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు చేయాలి: కవిత

TG: గ్రూప్-1 నోటిఫికేషన్ను రద్దు చేసి పరీక్షను మళ్లీ నిర్వహించాలని సీఎం రేవంత్కు ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ రాశారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందని అన్నారు. గ్రూప్-1 పరీక్ష నిర్వహించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగుల జీవితాలు అగాధంలోకి పడిపోయాయని పేర్కొన్నారు. పరీక్ష నిర్వహించిన తీరు, ఫలితాల వెల్లడిపై అభ్యర్థుల్లో సందేహాలు ఉన్నాయన్నారు.
News April 18, 2025
విడాకుల బాటలో మరో సెలబ్రిటీ జంట?

హీరోయిన్ నజ్రియా నజీమ్, ఫహాద్ ఫాజిల్ జంట విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. SMలో నజ్రియా పెట్టిన ఓ పోస్ట్ దీనికి బలం చేకూరుస్తోంది. ‘నేను డిప్రెషన్లోకి వెళ్లాను. ‘సూక్ష్మదర్శిని’ విజయాన్ని కూడా ఆస్వాదించలేకపోయా. ఇది చాలా కఠినమైన సమయం. పూర్తిగా కోలుకుని మళ్లీ మీ ముందుకొస్తా’ అంటూ రాసుకొచ్చారు. ఫహాద్తో విడాకుల వ్యవహారంతోనే ఆమె డిప్రెషన్లో వెళ్లారేమోనని నెటిజన్లు భావిస్తున్నారు.