News January 31, 2025
సిద్దిపేట: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య..!

అప్పుల బాధతో ఓ రైతు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని గొల్లపల్లి గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దొమ్మాట కిష్టయ్య(50) అనే రైతు ఏడాది క్రితం కుమార్తె వివాహాం కోసం రూ.15లక్షల అప్పు చేశాడు. తనకున్న ఎకరంన్నర భూమితో పాటు 7ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వరి, పత్తిని సాగు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News October 22, 2025
హైదరాబాద్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్లో నేడు సదర్ ఉత్సవ మేళా సందర్భంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా నారాయణగూడలోని వైఎంసీఏ వద్ద ఉత్సవం జరగనున్న నేపథ్యంలో రామ్కోటి, లింగంపల్లి, బర్కత్పూరా, హిమాయత్నగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. వాహనదారులు అసౌకర్యాన్ని నివారించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
News October 22, 2025
పేదల కోసం జీవితాన్ని అంకితం చేసిన ప్రభుత్వాధికారి కథ ఇది.!

1957 బ్యాచ్కు చెందిన IAS అధికారి S.R. శంకరన్ పేరుమీద మన గుంటూరు కలెక్టరేట్ ఒక కాన్ఫరెన్స్ హాలు ఉందని మీకు తెలుసా?. S.R శంకరన్ 1934, అక్టోబర్ 22న జన్మించారు. 1957లో IASగా ప్రస్థానం మొదలుపెట్టి, 1992లో పదవీ విరమణ చేశారు. ప్రజాసేవ కోసం పెళ్లి దూరంగా ఉన్నారు. తనకి భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించినప్పుడు దాన్ని తిరస్కరించడమే గాక, ఆ విషయం ప్రచురించవద్దని పత్రికా విలేకరులను ప్రాథేయపడ్డారు.
News October 22, 2025
హైదరాబాద్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్లో నేడు సదర్ ఉత్సవ మేళా సందర్భంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా నారాయణగూడలోని వైఎంసీఏ వద్ద ఉత్సవం జరగనున్న నేపథ్యంలో రామ్కోటి, లింగంపల్లి, బర్కత్పూరా, హిమాయత్నగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. వాహనదారులు అసౌకర్యాన్ని నివారించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.