News January 31, 2025
సిద్దిపేట: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య..!

అప్పుల బాధతో ఓ రైతు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని గొల్లపల్లి గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దొమ్మాట కిష్టయ్య(50) అనే రైతు ఏడాది క్రితం కుమార్తె వివాహాం కోసం రూ.15లక్షల అప్పు చేశాడు. తనకున్న ఎకరంన్నర భూమితో పాటు 7ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వరి, పత్తిని సాగు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News April 16, 2026
వనపర్తి: ప్రేమ పేరుతో మోసం.. యువకుడిపై కేసు

పెబ్బేరులో ప్రేమ, పెళ్లి పేరుతో మహిళను మోసం చేసిన జుర్రు మహేశ్పై కేసు నమోదు అయింది. ఓ యువతిని ప్రేమిస్తున్నానని నమ్మించి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి 2021సంవత్సరం నుంచి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఇప్పుడు మరో యువతిని పెళ్లి చేసుకొని మోసం చేశాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై పెబ్బేరు పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు.
News April 16, 2026
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ‘దోస్త్’ సందడి

డిగ్రీ ప్రవేశాల కోసం ‘దోస్త్’ (DOST) ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలోని ప్రముఖ విద్యాసంస్థలైన నిజామాబాద్లోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ మహిళా కళాశాల, కామారెడ్డిలోని ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, మెరుగైన వసతులు ఉండటంతో ఈ కళాశాలలకు డిమాండ్ పెరిగింది. మే 7 వరకు మొదటి విడత రిజిస్ట్రేషన్లకు గడువు ఉంది.
#SHAREIT
News April 16, 2026
HYD: మత్తుకు బానిసయ్యారా? ఇక్కడికి తీసుకురండి

మత్తుకు బానిసైన వారికి విముక్తి కల్పించడం కోసం ప్రభుత్వం డీ అడిక్షన్ సెంటర్లను ప్రారంభించింది. HYD గాంధీ ఆసుపత్రిలోనూ సెంటర్ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం సేవలు ప్రారంభమయ్యాయి. మద్యం, గంజాయి, సిగరెట్ ఇతర మత్తు పదార్థాలకు బానిసలుగా మారటంతో వ్యక్తిగత జీవితంతో పాటు, కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వాటి నుంచి విముక్తి కల్పించడం కోసం చర్యలు చేపట్టారు.


