News January 31, 2025
సిద్దిపేట: అవార్డులు అందజేసిన సీపీ

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్కృష్ట, అతిఉత్కృష్ట సేవా పతకాలు పొందిన అధికారులను సిబ్బందిని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ అభినందించి, సేవా పథకాలు అందజేశారు. ఉత్కృష్ట సేవా పథక్ పొందిన వారిలో ఏఆర్ కానిస్టేబుళ్లు కే. శ్రీరామ్, కే.మల్లికార్జున్, మహిళా హోంగార్డు మమ్మద్ నసీమా, అతి ఉత్కృష్ట సేవా పథక్ను వెంకటరమణారెడ్డి, గోపాల్ రెడ్డి, ప్రభాకర్, నారాయణ, యాదయ్య, ప్రభు, జీవన్, అలెగ్జాండర్ పొందారు.
Similar News
News November 19, 2025
పల్నాడులో 2,40,530 మంది రైతులు అర్హులు

పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులను ప్రభుత్వం బుధవారం రైతుల ఖాతాల్లో బుధవారం జమ చేయనుంది. 2,40,530 మంది రైతుల ఖాతాలో రూ.168,37 కోట్లు జమ చేయడానికి వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసింది. నియోజకవర్గం వారీగా.. సత్తెనపల్లి 36,752, నరసరావుపేట 20,463, చిలకలూరిపేట 21,669, పెదకూరపాడు 41,149, గురజాల 35,676, వినుకొండ 45,898, మాచర్ల 38,923 రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ.7000 ఆర్థిక సహాయం చేస్తుంది.
News November 19, 2025
కడప: నడిరోడ్డుపై కొట్లాడుకున్న పోలీసులు

పెండ్లిమర్రి మండలం వెల్లటూరులో మంగళవారం పోలీసుల మధ్య గొడవ జరిగింది. సీఎం చంద్రబాబు పర్యటన బుధవారం జరగనుంది. ఈ క్రమంలో బందోబస్తుగా మంగళవారం వచ్చిన ఏఎస్ఐ, కానిస్టేబుల్ ఓ హోటల్ వద్ద మాట మాట పెరిగి గొడవకు దిగారు. మీరెంత అంటే మీరెంత అంటూ రెండు గ్రూపులుగా విడిపోయిన పోలీసులు నడిరోడ్డుపై కలబడ్డారు. స్థానికులు, తోటి పోలీసులు వారికి సర్ది చెప్పారు. ఈ ఘటనపై స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు.
News November 19, 2025
హిడ్మా ఎన్కౌంటర్లో ఏపీ పోలీసుల సక్సెస్

ఛత్తీస్గఢ్లో జన్మించిన హిడ్మాకు దక్షిణ బస్తర్ ప్రాంతంలో గట్టి పట్టు ఉండేది. చాలాసార్లు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నాడు. ఇతడిని అంతం చేస్తే చాలు మావోయిజం అంతం అవుతుందని పోలీసులు భావించేవారు. కొన్ని నెలలుగా వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో ఛత్తీస్గఢ్ సేఫ్ కాదని భావించిన హిడ్మా.. ఏపీవైపు వచ్చాడని తెలుస్తోంది. గత నెల నుంచే అతడిపై నిఘా వేసిన ఏపీ పోలీసులు పక్కా వ్యూహంతో హిడ్మాపై దాడి చేశారు.


