News February 18, 2025
సిద్దిపేట: ఆర్చరీలో గోల్డ్ మెడల్.. సీపీ అభినందన

ఆర్చరీ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్ 2025 పోటీలలో బంగారు పతకం సాధించిన రశ్మిత రెడ్డిని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ అభినందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. సిద్దిపేటకు చెందిన చిరుకోటి రశ్మిత రెడ్డి జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆర్చరీ ఛాంపియన్ షిప్-2025 పోటీల్లో బంగారు పతకాన్ని సాధించడం అభినందనీయమని అన్నారు.
Similar News
News December 13, 2025
తిరుపతిలో కాలేజీ లెక్చరర్ సస్పెండ్

తిరుపతిలోని SV ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అన్యమత పాఠాలు చెప్పిన కాంట్రాక్ట్ ఇంగ్లీష్ లెక్చరర్ మాధవిని విద్యాశాఖ సస్పెండ్ చేసింది. విద్యార్థులకు <<18550600>>అన్యమత పాఠాలు <<>>చెప్పడంపై Way2Newsలో వార్త వచ్చింది. స్పందించిన ప్రిన్సిపల్ వెంటనే ఆమెను విచారించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఆమె గతంలోనూ ఇలాంటివి చేసినట్లు తేలడంతో సస్పెండ్ చేశామని ప్రిన్సిపల్ డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డి వెల్లడించారు.
News December 13, 2025
Stay Safe: రేపు, ఎల్లుండి కోల్డ్ వేవ్స్

తెలంగాణలో రేపు, ఎల్లుండి చలి తీవ్రత మరింత పెరగనుందని IMD తెలిపింది. కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒడిశాలోనూ తీవ్రమైన శీతలగాలులు వీస్తాయని పేర్కొంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయంది. TGలో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ఉదయం, రాత్రి వేళల్లో ప్రజలు బయటికి రావద్దని హెచ్చరించింది.
News December 13, 2025
కాసేపట్లో ఉప్పల్ స్టేడియానికి మెస్సీ

హైదరాబాద్ వచ్చిన ఫుట్బాల్ స్టార్ మెస్సీ ప్రస్తుతం ఫలక్నుమా ప్యాలెస్లో జరుగుతున్న మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు దీనికి హాజరయ్యారు. కేవలం 250 మందికి మాత్రమే మెస్సీని కలిసే అవకాశం కల్పిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ను కేటాయించారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మెస్సీ ఉప్పల్ స్టేడియానికి బయల్దేరుతారు.


