News April 7, 2025
సిద్దిపేట: ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

తాగిన మైకంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. ఎల్ బంజరుపల్లి గ్రామానికి చెందిన బొమ్మ రాజు (35) కుమ్మరి పని చేస్తూ కుటుంబంతో జీవిస్తున్నాడు. ఎప్పటిలాగే పనికి వెళ్లిన సరితా ఇంటికి తిరిగి వచ్చే వరకు రాజు ఇంట్లో ఉరి వేసుకున్నట్టు తెలిపింది. ప్రతి రోజు మద్యం సేవించి వచ్చేవాడని రాజు భార్య సరితా పోలీసులకు తెలిపింది.
Similar News
News October 16, 2025
VKB: 129 వరి ధాన్యం కేంద్రాలు ఏర్పాటు: కలెక్టర్

జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు నిర్వహించేందుకు 129 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో వరి ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం క్వింటాల్ ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2,389, సాధారణ రకానికి రూ.2,269 మద్దతు ధరను నిర్ధారించినట్లు చెప్పారు.
News October 16, 2025
ఖమ్మం: అడవి పంది మృతి.. ముగ్గురిపై కేసు

వేంసూరు మండలం ఎర్రగుంటపాడులో వరి పొలంలో పురుగు మందు పిచికారి చేయగా, ఆ నీరు తాగి ఓ అడవి పంది మృతి చెందింది. ఈ కళేబరాన్ని ఆయిల్పామ్ తోటలో పోగులు వేస్తున్న వాసం రామకృష్ణ, వాసం వెంకటేశ్వరరావు, చిలక సాయిపై వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఎస్ఓ నర్సింహ్మ తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్నామని, అటవీ జంతువులను వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News October 16, 2025
సంగారెడ్డి: మహిళల కోసమే భరోసా కేంద్రం: ఎస్పీ

మహిళల కోసమే భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పారితోష్ పంకజ్ తెలిపారు. భరోసా కేంద్రం 5వ వార్షికోత్సవం బుధవారం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలకు ఎలాంటి సమస్యలు ఉన్న ఈ కేంద్రంలో సంప్రదించవచ్చని చెప్పారు. కేంద్రం పనితీరు చాలా బాగుందని ప్రశంసించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.