News February 18, 2025

సిద్దిపేట: ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

image

పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేలా అధికారులు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం.మను చౌదరి అన్నారు. ఈనెల 27వ తేదీన జరగనున్న కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ, పట్టభద్రులు, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల పోలింగ్ నిర్వహణపై ఎన్నికల పీఓ, ఏపీఓలకు శిక్షణను ఇచ్చారు.

Similar News

News November 18, 2025

జేఎన్టీయూలో తినే ఆహారంలో పురుగులు

image

కూకట్‌పల్లి జేఎన్టీయూ యూనివర్సిటీలోని మంజీరా హాస్టల్‌లో విద్యార్థులు తినే ఆహారంలో మరోసారి పురుగులు దర్శనమిచ్చాయి. సోమవారం రాత్రి హాస్టల్లో అన్నం తినే సమయంలో పురుగులు కనిపించాయని, ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరారు.

News November 18, 2025

జేఎన్టీయూలో తినే ఆహారంలో పురుగులు

image

కూకట్‌పల్లి జేఎన్టీయూ యూనివర్సిటీలోని మంజీరా హాస్టల్‌లో విద్యార్థులు తినే ఆహారంలో మరోసారి పురుగులు దర్శనమిచ్చాయి. సోమవారం రాత్రి హాస్టల్లో అన్నం తినే సమయంలో పురుగులు కనిపించాయని, ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరారు.

News November 18, 2025

టెన్త్ పరీక్షలపై BIG UPDATE

image

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షలను మార్చి 16 లేదా 21వ తేదీ నుంచి నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఆ రెండు తేదీల ప్రకారం టైం టేబుళ్లను రూపొందించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. వీటిలో ఓ దానికి ఆమోదం లభించనుంది. ఈసారి 6.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు వీలుగా 3,500 సెంటర్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. 35వేల మంది ఇన్విజిలేటర్లు, స్క్వాడ్ సిబ్బంది ఎంపిక ప్రక్రియ మొదలైంది.