News February 18, 2025
సిద్దిపేట: ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేలా అధికారులు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం.మను చౌదరి అన్నారు. ఈనెల 27వ తేదీన జరగనున్న కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ, పట్టభద్రులు, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల పోలింగ్ నిర్వహణపై ఎన్నికల పీఓ, ఏపీఓలకు శిక్షణను ఇచ్చారు.
Similar News
News November 19, 2025
మర్రిపాడు: నవోదయ విద్యార్థిని ఆత్మహత్య..UPDATE

మర్రిపాడు మండలం, కృష్ణాపురం నవోదయ విద్యాలయంలో దారుణం చోటు చేసుకుంది.10వ తరగతి చదువుతున్న ప్రణీత (14) అనే విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అర్ధరాత్రి 2 సమయంలో మెట్ల కమ్ములకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న బాలికను చూసి ఆయమ్మ ప్రిన్సిపల్కి సమాచారం ఇచ్చింది. బాలిక ప్రణీత కావలి రూరల్ అడవిరాజుపాలెం గ్రామం. బాలిక తండ్రి కొండాపురం ఎంఈఓగా పనిచేస్తున్నారు.
News November 19, 2025
ఖమ్మం: చిరుత సంచారం.. రైతుల భయాందోళన

ముదిగొండ మండలం గంధసిరి గ్రామం నక్కల వాగు, బైండ్ బండ ఏరియాలో మంగళవారం సాయంత్రం చిరుత పులి సంచారం కలకలం సృష్టించింది. పులిని చూశామని స్థానిక వ్యవసాయదారులు దారగాని రమణమ్మ, దారగాని తిరుపయ్య చెప్పగా, రైతులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు బుధవారం ఉదయం గ్రామానికి చేరుకుని, చిరుత సంచరించిన ప్రదేశాలలో పాదముద్రలను పరిశీలిస్తున్నారు.
News November 19, 2025
తోట్లవల్లూరు: మినుముల యంత్రంలో పడి మహిళ మృతి

తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెంకు చెందిన మహిళ కూలి పనికి వెళ్లి మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. షేక్ కాసింబి(40) మినుములు నూర్చడానికి గుంటూరు (D) కొల్లిపర (M) వల్లభారానికి వెళ్లింది. ప్రమాదవశాత్తు మినుము నూర్పిడి యంత్రంలో చీర ఇరుక్కుని చేతులు, మెడకు తీవ్ర గాయాలై చనిపోయినట్లు ఎస్సై పి. కోటేశ్వరరావు తెలిపారు. ఆమె భర్త ఇస్మాయిల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసామన్నారు.


