News July 11, 2024
సిద్దిపేట: ఏఎస్ఐ ఉమ్మారెడ్డిపై బదిలీ వేటు

రవి అడ్వకేట్ పై దురుసుగా ప్రవర్తించాడని ఆరోపణలు వచ్చినందున టూ టౌన్ ఏఎస్ఐ ఉమారెడ్డిని సిద్దిపేట టూ టౌన్ నుంచి జిల్లా కమిషనరేట్కు అటాచ్ చేస్తూ సీపీ అనురాధ ఉత్తర్వులు జారీ చేశారని అడిషనల్ డిసిపి యస్.మల్లారెడ్డి తెలిపారు. అడ్వకేట్ పై దాడి విషయంలో టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్పై ఆరోపణలు రాగా గజ్వేల్ ఏసిపి కే.పురుషోత్తంరెడ్డిని విచారణ అధికారిగా నియమించామని, విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News July 5, 2025
మెదక్: IIITకి 345 మంది ఎంపిక

బాసర IIITకి ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 345 మంది విద్యార్థులు ఎంపికైనట్లు ఆయా జిల్లాల విద్యాధికారులు తెలిపారు. అత్యధికంగా సంగారెడ్డి జిల్లా నుంచి 222 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. మెదక్ నుంచి 78, సిద్దిపేట నుంచి 45 మంది విద్యార్థులు ఎంపికైనట్లు వెల్లడించారు. IIITకి ఎంపికైన విద్యార్థులను ఆయా జిల్లాల విద్యాధికారులు అభినందించారు.
News July 5, 2025
జిల్లాలో మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం: కలెక్టర్

మాదకద్రవ్యాల వినియోగం, రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు సంబంధిత అధికారులు బాధ్యతగా పని చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. శుక్రవారం కలక్టరేట్లో జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. సమాజానికి చీడ పురుగులా మారిన మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధానికి సమిష్టి కృషి చేసి యువత, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని అధికారులకు సూచించారు. ఎస్పీ శ్రీనివాసరావు ఉన్నారు.
News July 5, 2025
పిల్లల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: అదనపు కలెక్టర్

సంక్షేమ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో పిల్లల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. శుక్రవారం మెదక్ పట్టణంలోని మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, కళాశాల, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల డిగ్రీ కళాశాలను పరిశీలించారు. మధ్యాహ్నం భోజనం, వసతి సౌకర్యాలపై ఆరాతీశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.