News March 14, 2025

సిద్దిపేట: ఏప్రిల్ 20 నుంచి ఓపెన్ పరీక్షలు

image

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 26 వరకు(థియరీ) నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారులు పేర్కొన్నారు. ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 2:30గం. నుంచి 5:30 వరకు ఉంటాయన్నారు. పరీక్ష రుసుం చెల్లించిన వారే అర్హులని చెప్పారు. 26 నుంచి మే 3 వరకు ఇంటర్(ప్రాక్టికల్) పరీక్షలు ఉంటాయన్నారు. డిగ్రీ సెమిస్టర్-1 హాల్ టికెట్లు బుధవారం విడుదల అయ్యాయి.

Similar News

News November 22, 2025

‘టూరిజం స్పాట్‌గా దేవనూరు గుట్టల అభివృద్ధి’

image

దేవనూరు గుట్టలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. శనివారం ఉనికిచర్లలో ఆయన మాట్లాడుతూ… పట్టణ ప్రాంత ప్రజలు సెలవుల్లో సేదతీరేందుకు వీలుగా, ఈ ప్రాంతంలో ఆక్సిజన్ పార్కులు, ట్రెక్కింగ్ మార్గాలు, రాత్రి బస చేసేందుకు రిసార్ట్ వంటి సదుపాయాలు కల్పిస్తామన్నారు. నియోజకవర్గ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని కడియం స్పష్టం చేశారు.

News November 22, 2025

మలికిపురం: డిప్యూటీ సీఎం పర్యటన ప్రాంతాలు పరిశీలిన

image

కలెక్టర్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం పవన్ కళ్యాణ్ పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు. ఈనెల 26వ తేదీన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేసనపల్లి, తూర్పుపాలెం, ములిక్కి పల్లి , శివకోడు ప్రాంతాలను పర్యటించనున్నారు. పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్ని ప్రాంతాలను కలెక్టర్‌కు తెలిపారు.

News November 22, 2025

MBNR: పరీక్షలను సజావుగా నిర్వహించాలి.. పీయూ వీసీ ఆదేశం

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు విశ్వవిద్యాలయం అనుబంధ డిగ్రీ కళాశాలల్లో 1, 3, 5వ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వీసీ ఆచార్య శ్రీనివాస్ ఎగ్జామినేషన్ ఫ్లైయింగ్ స్క్వాడ్స్ అధికారులతో సమావేశం నిర్వహించారు. మాల్‌ప్రాక్టీస్‌కు తావు లేకుండా పరీక్షలు సజావుగా సాగేలా చూడాలని అధికారులకు వీసీ స్పష్టం చేశారు. అనంతరం అధికారులకు ఆర్డర్ కాపీలను అందజేశారు.