News March 14, 2025
సిద్దిపేట: ఏప్రిల్ 20 నుంచి ఓపెన్ పరీక్షలు

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 26 వరకు(థియరీ) నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారులు పేర్కొన్నారు. ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 2:30గం. నుంచి 5:30 వరకు ఉంటాయన్నారు. పరీక్ష రుసుం చెల్లించిన వారే అర్హులని చెప్పారు. 26 నుంచి మే 3 వరకు ఇంటర్(ప్రాక్టికల్) పరీక్షలు ఉంటాయన్నారు. డిగ్రీ సెమిస్టర్-1 హాల్ టికెట్లు బుధవారం విడుదల అయ్యాయి.
Similar News
News February 11, 2026
నెల్లూరు: టెన్త్ విద్యార్థులకు రేపే లాస్ట్ ఛాన్స్

నెల్లూరు జిల్లాలో మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. భవిష్యత్తులో 10 మార్కుల లిస్ట్ అన్నింటికీ కీలకం. అందులో తప్పులు ఉంటే ఇబ్బందులు వస్తాయి. ఇప్పటికే ఫీజు చెల్లించిన విద్యార్థులు మీ వివరాల్లో తప్పులు ఉంటే రేపటి(FEB 12) లోగా సరిచేసుకోవాలి. HMలను సంప్రదించి విద్యార్థి, తల్లిదండ్రుల పేర్లు, కులం, ఫొటో, సంతకం మార్చుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ మార్చడం వీలుండదని అధికారులు తెలిపారు.
News February 11, 2026
ఆసిఫాబాద్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

బెజ్జూర్ మండలం హేటిగూడ గ్రామంలో ఓ శుభకార్యానికి వచ్చిన వారు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా అభిరామ్(6) సోమవారం మృతిచెందగా నగోశ్ మొండి (17) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మరో వ్యక్తి వడాయి మోహన్ ఆస్పత్రిలో వైద్యం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఎస్సై సర్తాజ్ పాషా కేసు నమోదు చేశారు.
News February 11, 2026
WGL: మున్సి’పోల్’.. ఓటు కోసం తరలివెళ్తారా?

పట్టణ ఓటర్లు ఓటు కోసం తరలివెళ్తారా? అనేది అభ్యర్థులను కలవర పెడుతున్న అంశం. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వర్ధన్నపేటలో 88.63%, నర్సంపేట 82.26%, డోర్నకల్ 83.20%, మరిపెడ 82.88%, పరకాల 81.89%, జనగామ 79.32%, MHBD 78.01%, తొర్రూర్ 72.62%, BHPLలో 63.37% పోలింగ్ శాతం నమోదైంది. ఈ సారి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 మునిసిపాలిటీల్లోని 260 వార్డుల్లో 3.35 లక్షల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.


