News February 22, 2025
సిద్దిపేట: ‘ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి’

ఫిబ్రవరి 27న నిర్వహించనున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. మెదక్- నిజామాబాద్-ఆదిలాబాద్- కరీంనగర్ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గం, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లపై ఆయా జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Similar News
News October 15, 2025
సిద్దిపేట: ఉచిత చేప పిల్లల కోసం ఎదురుచూపులు

మత్స్యకారుల జీవనోపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలను వదులుతుంది. ఐతే ఈ ఏడాది చేప పిల్లల సరఫరా కోసం ప్రభుత్వం టెండర్లు పిలిచిన నేపథ్యంలో అవి ఎటూ తేలలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత చేప పిల్లల కోసం మత్స్యకారులు ఎదురు చూస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో చెరువులు, కుంటలు మొత్తం 1715 ఉన్నాయి. ఇక్కడ 10 కోట్ల చేప పిల్లలను వదలడంతో 50 వేల మంది ఉపాధి పొందనున్నారు.
News October 15, 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ఎగ్జిట్ పోల్స్పై నిషేధం

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో NOV 6 ఉ.7 గంటల నుంచి 11 సా. 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్పై నిషేధం విధిస్తున్నట్లు ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఇది TV, రేడియో, పత్రికలు, SM, డిజిటల్ ప్లాట్ఫామ్ వంటి అన్ని సమాచార మాధ్యమాలకు వర్తిస్తుందన్నారు. నిబంధనలు ఉల్లంఘించినవారికి చట్టప్రకారం రెండేళ్ల జైలు/జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుందన్నారు. కాగా NOV 11న పోలింగ్ జరగనుంది.
News October 15, 2025
అనారోగ్యంతో గిరిజన విద్యార్థిని మృతి

బొబ్బిలి మండలం కృపావలసకు చెందిన గిరిజన విద్యార్థిని తాడంగి పల్లవి (11) అనారోగ్యంతో ఈనెల 12న విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. పల్లవి సాలూరు మండలం మామిడిపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో 7వ తరగతి చదువుతుంది. దసరా సెలవులకు ఇంటికి వచ్చి అనారోగ్యం బారిన పడడంతో ఆసుపత్రిలో చేర్పించగా ఆదివారం మృతి చెందింది. మృతి విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. కుమార్తె మృతితో కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.