News March 3, 2025

సిద్దిపేట: ఐఐటీలు ఆవిష్కరణకు వేదిక కావాలి: ఉపరాష్ట్రపతి

image

ఐఐటీలో నూతన ఆవిష్కరణకు వేదిక కావాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. దేశ అభివృద్ధికి ఐఐటీ విద్యార్థులు తోడ్పాటు అందించాలని చెప్పారు. నూతన ఆవిష్కరణలు చేసి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో ఐఐటి డైరెక్టర్ మూర్తి, కలెక్టర్ వల్లూరు క్రాంతి, అధికారులు పాల్గొన్నారు.

Similar News

News October 28, 2025

పలాస: జిల్లా మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు

image

మొంథా తుపాన్ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు మంగళవారం రైల్వే అధికారులు వెల్లడించారు. జిల్లా మీదుగా వెళ్లే భువనేశ్వర్-బెంగళూరు(ప్రశాంతి ఎక్స్‌ప్రెస్), భువనేశ్వర్-హైదరాబాద్(విశాఖ ఎక్స్‌ప్రెస్), కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు విశాఖ-బరంపురం(ఇంటర్ సీటీ) ఎక్స్‌ప్రెస్, పలాస-విశాఖ(మెమో) ప్యాసెంజర్ రైళ్లు రద్దు చేశారు. రైల్వే ప్రయాణీకులు గమనించాలని కోరారు.

News October 28, 2025

ఇక ‘సింగూరు’ చిక్కులు లేకుండా ప్రభుత్వం చర్యలు

image

హానగరానికి తాగునీటిని సరఫరా చేసే సింగూరు రిజర్వాయరుకు మరమ్మతులు చేయాలని సర్కారు నిర్ణయించింది. దీనికోసం సర్కారు రూ.16 కోట్లను విడుదల చేసింది. ఈ డిసెంబర్ నుంచి పనులు మొదలు కానున్నాయి. ఈలోపు రిజర్వాయర్‌లో ఉన్న నీటిని ఖాళీ చేయనున్నారు. దాదాపు రెండు ఏళ్ల పాటు సింగూరుకు పనులు జరగుతాయి. ప్రస్తుతం సింగూరు నుంచి సిటీకి 7 TMCల నీరు ఉపయోగిస్తున్నారు.

News October 28, 2025

కర్ణాటక కాంగ్రెస్‌కు TDP కౌంటర్

image

AP: గూగుల్ డేటా సెంటర్‌పై కర్ణాటక కాంగ్రెస్ అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. ‘KA గూగుల్‌‌ను కోల్పోలేదు. దానిని మరో రాష్ట్రానికి మళ్లించారు. ఉచితాలు, సబ్సిడీల ఆశచూపి దానిని పొందారు. మేము పెట్టుబడుల కోసం అభ్యర్థించం, అడుక్కోం’ అంటూ KA కాంగ్రెస్ చేసిన ట్వీట్‌కు TDP కౌంటరిచ్చింది. ‘AP పురోగతి కర్ణాటక కాంగ్రెస్ ఫేవరెట్ టాపిక్ అయిపోయింది. మన అభివృద్ధి వారికి కాస్త ఘాటుగా అనిపిస్తోంది’ అని ట్వీట్ చేసింది.