News October 10, 2024
సిద్దిపేట: ఒకే ఇంట్లో నలుగురికి MBBS సీట్లు

సిద్దిపేటకు చెందిన రామచంద్రం, శారద దంపతుల నలుగురు కుమార్తెలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో MBBS సీట్లు పొందారు. పెద్ద కుమార్తె మమత 2018లో MBBSలో చేరి డిగ్రీ పూర్తి చేసింది. రెండో కుమార్తె మాధవి 2020లో, ఈ ఏడాది మరో ఇద్దరు కుమార్తెలు రోహిణి, రోషిణి MBBSలో సీటు సాధించారని తండ్రి రామచంద్రం తెలిపారు. KCR జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతోనే ఇది సాధ్యమైందన్నారు. నేడు ఎమ్మెల్యే హరీశ్ రావును కలిశారు.
Similar News
News December 18, 2025
మెదక్: ఎన్నికల్లో రూ. 1,01,32,000 స్వాధీనం

మెదక్ జిల్లాలో మూడు విడతల ఎన్నికల చేపట్టిన తనిఖీలలో రూ. 1,01,32,000 విలువైన నగదు, లిక్కర్, పిడిఎస్ బియ్యం పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. రూ. 47.48 లక్షల నగదు, 268 కేసుల్లో రూ. 26,46,968 విలువైన 3688 లీటర్ల మద్యం, రూ. 27.36 లక్షల విలువైన 673 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యము స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
News December 18, 2025
నర్సాపూర్: మూడో విడతలో అత్యధిక ఓటింగ్

మెదక్ జిల్లాలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు 7 మండలాల్లో నిర్వహించారు. 7 మండలాల్లో నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో నర్సాపూర్ మండలంలో అత్యధికంగా 93.38 శాతం ఓటింగ్ జరిగినట్లు అధికార ప్రకటించారు. మండలంలో 26,927 మంది ఓటర్లు ఉండగా, 12,260 మంది పురుషులు, 12,883 మంది మహిళలు, ఇతరులు ఒక్కరుగా.. 25,144 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు వివరించారు.
News December 18, 2025
నర్సాపూర్: మూడో విడతలో అత్యధిక ఓటింగ్

మెదక్ జిల్లాలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు 7 మండలాల్లో నిర్వహించారు. 7 మండలాల్లో నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో నర్సాపూర్ మండలంలో అత్యధికంగా 93.38 శాతం ఓటింగ్ జరిగినట్లు అధికార ప్రకటించారు. మండలంలో 26,927 మంది ఓటర్లు ఉండగా, 12,260 మంది పురుషులు, 12,883 మంది మహిళలు, ఇతరులు ఒక్కరుగా.. 25,144 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు వివరించారు.


