News February 12, 2026
సిద్దిపేట: ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద BNSS 163 సెక్షన్

ఈనెల 13న సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని చేర్యాల, హుస్నాబాద్, దుబ్బాక, గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద (163 BNSS) సెక్షన్ అమల్లో ఉంటుందని సీపీ రష్మి పెరుమాళ్ పేర్కొన్నారు. 5 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుంపు ఉండొద్దన్నారు. బాణసంచా కాల్చడం, విజయ యాత్రలకు అనుమతి లేదన్నారు. ఉదయం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఈ సెక్షన్ అమల్లో ఉంటుందని సహకరించాలని కోరారు.
Similar News
News March 16, 2026
HYD: ఆదివారం.. నెత్తురోడిన నగరం

నగరంలో వీకెండ్ రక్తపాతం జరిగింది. వరుస ప్రమాదాలు, దారుణ ఘటనలు కలకలం రేపాయి. మేడిపల్లిలో కారు ఢీకొనడంతో దంపతులు దుర్మరణం పాలయ్యారు. ఒక్కగానొక్క కొడుకు అనాథయ్యాడు. ఉప్పల్లో కానిస్టేబుల్ సుధీర్ను దారుణంగా కత్తులతో హత్య చేశారు. శంషాబాద్లో వాహనం ఢీకొని విజయ్ (32) మృతి చెందాడు. గచ్చిబౌలిలో కర్ణాటక RTC బస్సు ఢీకొనడంతో బాలమ్మ (68) ప్రాణాలు కోల్పోయింది. ఒకే రోజు ఇన్ని దారుణాలు జరిగాయి.
News March 16, 2026
గ్యాస్ కొరత అంటూ అసత్య ప్రచారం.. వ్యక్తిపై కేసు: సీఐ

గ్యాస్ సిలిండర్ల కొరత అంటూ తప్పుడు సమాచారాన్ని వైరల్ చేసిన యూట్యూబర్ అమీర్ బాషాపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశాలతో క్రైం నంబర్ 40/2026 U/S 353, 196, 356 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ జయనాయక్ తెలిపారు. ప్రజల్లో గందరగోళం, అశాంతి రేకెత్తించేలా అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
News March 16, 2026
10వ తరగతి పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ మృతి

కర్నూలు జిల్లాలో పదో తరగతి పరీక్షల వేళ మొదటి రోజు విషాద ఘటన జరిగింది. కర్నూలులోని పరీక్ష కేంద్రం శ్రీ చైతన్య పాఠశాలకు చీఫ్ సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న షేక్ అన్వర్ బాషా అకస్మాత్తుగా మృతి చెందారు. గ్యాస్ట్రిక్ సమస్యతో ఆయన అస్వస్థతకు గురవగా సిబ్బంది పరీక్ష కేంద్రం సమీపంలోని అమ్మ హాస్పిటల్కు తరలించారు. హాస్పిటల్లో మృతి చెందినట్లు డీఈవో కార్యాలయం ధ్రువీకరించింది.


