News February 4, 2025

సిద్దిపేట కమిషనరేట్‌లో 544 అవగాహన కార్యక్రమాలు

image

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో వాహనదారులకు ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనల గురించి 544 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు సీపీ డాక్టర్ బి. అనురాధ తెలిపారు. అవేర్నెస్ కార్యక్రమంలో రాష్ట్రంలో మూడో స్థానం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ నిలిచిందని తెలిపారు. ప్రజలు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు.

Similar News

News February 4, 2025

మీ ఇంట్లో సర్వే అయిందా?

image

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సర్వే సరిగ్గా చేయలేదని, ఎవరూ తమ ఇంటికి రాలేదని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇంటికే కాదు తమ కాలనీల్లోని చాలా అపార్ట్‌మెంట్లలో సర్వే జరగలేదని ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే ప్రజలు అందుబాటులో లేకపోవడంతో 3% మంది సర్వేలో పాల్గొనలేదని ప్రభుత్వం చెబుతోంది. మరి మీ ఇంట్లో సర్వే జరిగిందా? కామెంట్ చేయండి.

News February 4, 2025

గుడివాడ: లారీ ఢీకొని వ్యక్తి గుర్తుతెలియని మృతి

image

గుడివాడ మార్కెట్ సెంటర్‌లో మంగళవారం సాయంత్రం టిప్పర్ ఢీకొని సైక్లిస్ట్ మృతి చెందాడు. ఏలూరు రోడ్‌లో నుంచి పామర్రు రోడ్డు వైపు వెళ్తున్న టిప్పర్ మార్కెట్ సెంటర్లోని కటారి సత్యనారాయణ చౌకు వద్ద మలుపులో సైకిల్ మీద వస్తున్న వృద్ధుడిని ఢీకొట్టింది. ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు అక్కడకు చేరుకుని లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News February 4, 2025

BHPL: నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించాలి: DMHO

image

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించాలని డీఎంహెచ్వో డాక్టర్.మధుసూదన్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన ఎంవో, డాక్టర్లు, సూపర్‌వైజర్లతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడారు. జాతీయ నులిపురుగుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. 1 నుంచి 19 ఏళ్లు ఉన్న ప్రతిఒక్కరికి నులిపురుగుల నివారణ మాత్రలు వేయాలని సూచించారు.

error: Content is protected !!