News February 17, 2025

సిద్దిపేట: కలెక్టరేట్‌లో బయోమెట్రిక్ విధానం అమలు

image

సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో విధులు నిర్వహిస్తున్న అన్ని శాఖల అధికారులు, సిబ్బంది హాజరు వివరాల నమోదు కోసం బయోమెట్రిక్ విధానం అమలులోకి తెస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి తెలిపారు. బయోమెట్రిక్ యంత్రాల ఫిట్టింగ్ పనులను జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి జిల్లా అధికారుల నుంచి కింద స్థాయి సిబ్బంది వరకు బయోమెట్రిక్ విధానంలో హాజరు నమోదుకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.

Similar News

News November 10, 2025

సైబరాబాద్ వ్యాప్తంగా 529 మందిపై కేసు నమోదు

image

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 16 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యంతాగి వాహనాలు నడిపే వారిపై కఠినంగా వ్యవహరించారు. 529 మందిపై కేసు నమోదు చేశారు. 417 బైకులు, 24 త్రీ వీలర్స్, 88 కార్లతో పాటు పలు వాహనాలను సీజ్ చేశారు. 20 నుంచి 30 ఏళ్ల వయసు గలిగిన వారే ఎక్కువ శాతం మద్యంతాగి వాహనాలను నడిపినట్లు గుర్తించారు. ఇప్పటికైనా ప్రజలు మారాలని సూచిస్తున్నారు.

News November 10, 2025

అవి శశిథరూర్ వ్యక్తిగత అభిప్రాయాలు: కాంగ్రెస్

image

బీజేపీ అగ్రనేత అద్వానీపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ <<18243287>>ప్రశంసలు<<>> కురిపించడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు అని వెల్లడించింది. ఆ మాటలకు పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఇవి ప్రతిబింబిస్తాయని తెలిపింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్య, ఉదారవాద స్ఫూర్తికి ఈ మాటలు నిదర్శనమని కాంగ్రెస్ నేత పవన్ ఖేడా వెల్లడించారు.

News November 10, 2025

అవాస్తవాలు ప్రచారం చేయద్దు: పలమనేరు DSP

image

ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంప్ ప్రారంభించడానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన తిరుగు ప్రయాణంలో ఇందిరానగర్ వద్ద జరిగిన తోపులాటలో హేమలత అనే మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. దీనిని కొంతమంది సోషల్ మీడియాలో కాన్వాయ్ వాహనం ఢీకొనిందని దుష్ప్రచారం చేస్తున్నారు. అది పూర్తిగా అవాస్తవమని DSP ప్రభాకర్ తెలిపారు. ఎవరైనా ఈ విషయంపై మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.