News February 10, 2025
సిద్దిపేట: కానిస్టేబుల్ వేణును అభినందించిన సీపీ

1150 సూర్య నమస్కారాలు చేసి రాష్ట్రంలో రెండవ స్థానం పొంది సిల్వర్ మెడల్ సాధించిన ఎస్బీ కానిస్టేబుల్ వేణును సిద్దిపేట సీపీ అనురాధ అభినందించారు. సిద్దిపేట పట్టణం గర్ల్స్ హై స్కూల్ ఆవరణలో వ్యాస మహర్షి యోగా సొసైటీ, జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ సమన్వయంతో నిర్వహించిన రాష్ట్రస్థాయి సూర్య నమస్కారాల పోటీల్లో వేణు 1150 సూర్య నమస్కారాలు చేసి రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానంలో నిలిచారు.
Similar News
News February 12, 2026
నమీబియాతో మ్యాచ్.. ప్రయోగాలు చేస్తారా?

USAపై గెలిచిన టీమ్ ఇండియా ఇవాళ T20 WCలో రెండో మ్యాచ్ నమీబియాతో ఆడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో 7pmకు మొదలయ్యే మ్యాచులో పలు ప్రయోగాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కోచ్ గంభీర్ సానూకూలంగా ఉండటంతో శాంసన్ను తుది జట్టులోకి తీసుకోనున్నట్లు సమాచారం. బుమ్రాకు రెస్ట్ కొనసాగించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అటు అభిషేక్ ఫిట్నెస్పై ఇంకా క్లారిటీ లేకపోగా టీమ్11లో ఉంటాడా అనేది అనుమానమే.
News February 12, 2026
బ్రిటీష్ అధికారికి స్వామివారి దర్శనం

బ్రిటీష్ కాలంలో సర్ థామస్ మన్రో అనే అధికారి మంత్రాలయ మఠం భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని భావించారు. అయితే, ఆశ్చర్యకరంగా రాఘవేంద్ర స్వామి బృందావనం నుంచి బయటకు వచ్చి మన్రోకు దర్శనమిచ్చారు. ఆయనతో చర్చించి భూములను స్వాధీనం చేసుకోకుండా ఒప్పించారు. ఈ సంభాషణ గురించి మన్రో స్వయంగా ‘మద్రాస్ గెజిట్’లో నమోదు చేయడం విశేషం. ఓ పరాయి దేశస్థుడికి కూడా దర్శనమిచ్చిన స్వామివారి కరుణా సాగరం అనంతమైనది.
News February 12, 2026
మెదక్: ఓటు వేసిన 99 ఏళ్లు వృద్ధుడు

మెదక్ మున్సిపల్ ఎన్నికల్లో పట్టణానికి చెందిన 99 ఏళ్ల మర్తి కిష్టయ్య తన ఓటు హక్కును వినియోగించుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వం సెలవు ప్రకటించినా చాలామంది ఓటు వేయకుండా కాలక్షేపం చేస్తున్న తరుణంలో, ఈ వయసులో కూడా ఆయన పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని గుర్తు చేశారు. కిష్టయ్య సంకల్పాన్ని చూసి స్థానికులు, అధికారులు అభినందించారు.


