News March 4, 2025

సిద్దిపేట: గవర్నర్‌ను కలిసిన జిల్లా కలెక్టర్

image

హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ బుధవారం ఉదయం కుటుంబ సమేతంగా కొమురవెల్లి మల్లికార్జునస్వామి దర్శనానికి రాగా జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి, గజ్వేల్ ఆర్డీఓ చంద్రకళ వేరువేరుగా పుష్ప గుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అలాగే ప్రభుత్వ లాంఛనాల ప్రకారం పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. తదుపరి శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుని పట్నం వేసి మొక్కులు తీర్చుకున్నారు.

Similar News

News November 27, 2025

ఇమ్రాన్‌ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారు: పాక్ రక్షణ మంత్రి

image

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ జైలులో ఆరోగ్యంగా ఉన్నారని రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వెల్లడించారు. జైలులో 5స్టార్ హోటల్ కంటే మెరుగైన ఫుడ్ అందుతోందని, టీవీ చూసేందుకు, వ్యాయామానికి అనుమతిచ్చినట్టు చెప్పారు. నేడు, డిసెంబర్ 2న ఆయనను కలిసేందుకు కుటుంబసభ్యులకు జైలు అధికారులు అనుమతిచ్చారు. ఇమ్రాన్‌ను మరో జైలుకు తరలించారనే వార్తలను తోసిపుచ్చారు. రావల్పిండి జైలు దగ్గర ఇమ్రాన్ మద్దతుదారులు ఆందోళన విరమించారు.

News November 27, 2025

రాజవొమ్మంగి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడి మృతి

image

రాజవొమ్మంగి గ్రామానికి చెందిన అబ్దుల్ ఆదివారం రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. గ్రామంలో కిరాణా షాపు నిర్వాహకుడు దావుద్ కుమారుడు అయిన అబ్దుల్ ఆదివారం ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తుండగా రాజవొమ్మంగి శివారులో టాటా ఏస్ వాహనాన్ని ఢీ కొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అబ్దుల్ కాకినాడ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News November 27, 2025

KNR: పంచాయతీ పోరు.. అభ్యర్థుల ఎంపికకు కసరత్తులు

image

ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో జీపీ ఎన్నికల్లో పోటీకి దింపేందుకు రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు జరుపుతున్నాయి. అర్థబలం, ప్రజల్లో పేరు ప్రతిష్టలు ఉన్న నాయకులను రంగంలోకి దింపేందుకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. పార్టీ గుర్తులు లేకుండా జరిగే ఎన్నికలు అయినప్పటికీ పల్లెల్లో పట్టు నిలుపుకోవడానికి పంచాయతీ పాలకవర్గం కీలకం. KNRలో 316, JGTLలో 385, SRCLలో 260, PDPLలో 263 జీపీలు ఉన్నాయి.