News March 4, 2025
సిద్దిపేట: గవర్నర్ను కలిసిన జిల్లా కలెక్టర్

హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ బుధవారం ఉదయం కుటుంబ సమేతంగా కొమురవెల్లి మల్లికార్జునస్వామి దర్శనానికి రాగా జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి, గజ్వేల్ ఆర్డీఓ చంద్రకళ వేరువేరుగా పుష్ప గుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అలాగే ప్రభుత్వ లాంఛనాల ప్రకారం పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. తదుపరి శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుని పట్నం వేసి మొక్కులు తీర్చుకున్నారు.
Similar News
News November 27, 2025
నామినేషన్కు ముగ్గురికి మాత్రమే అనుమతి: కలెక్టర్

నామినేషన్ దాఖాలుకు ముగ్గురికి మాత్రమే అనుమతి ఉంటుందని కలెక్టర్ హైమావతి తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గురువారం జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో 508 గ్రామపంచాయితీలు, 4508 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశామని, 27 నవంబర్ గురువారం మొదటి విడత నామినేషన్ ప్రక్రియ మొదలయ్యిందన్నారు.
News November 27, 2025
HYD: SSC JE ఎగ్జామ్ దరఖాస్తు చేశారా!

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూనియర్ ఇంజినీర్ (JE) పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న వారికి HYD రీజియన్ అధికారి డా.ప్రసాద్ ముఖ్య సూచన చేశారు. ఎగ్జామ్స్ స్లాట్ సెలక్షన్ చేసుకుని అభ్యర్థులు లాగిన్ ఆప్షన్ ద్వారా ఫీడ్బ్యాక్ ఓపెన్ చేసి HYD ఎగ్జామ్ సిటీ లొకేషన్ ఎంచుకోవాలని సూచించారు. ఎంపిక కోసం DEC 28 వరకు గడువు ముగుస్తుందని తెలిపారు.
News November 27, 2025
జగిత్యాల జిల్లాలో తొలి రోజు 48 సర్పంచ్ నామినేషన్లు

జగిత్యాల జిల్లాలో మొదటి విడత 122 గ్రామపంచాయతీ ఎన్నికలకు నామినేషన్ మొదటి రోజు సర్పంచ్ స్థానాలకు 48, వార్డు మెంబర్ స్థానాలకు 33 నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల అధికారి సత్యప్రసాద్ తెలిపారు. బీమారం సర్పంచ్ 10, వార్డు మెంబర్ 11, కథలాపూర్ S.13, W 9, మల్లాపూర్ S.6 W.1, కోరుట్ల S.6, W.5, మెట్పల్లి S.8, W.5, ఇబ్రహీంపట్నం S.5, W.2 నామినేషన్లు దాఖలు అయినట్లు పేర్కొన్నారు.


