News February 6, 2025
సిద్దిపేట: గురుకుల ప్రవేశాలకు నేడే లాస్ట్

రాష్ట్రంలోని గురుకులాల పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట జిల్లా అధికారులు సూచించారు. 2025–26లో ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 5వ తరగతిలో ఖాళీలు, 6 నుంచి 9వ తరగతి వరకు ఖాళీల భర్తీకి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 23న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
Similar News
News January 4, 2026
కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా ఆమంచి కృష్ణ మోహన్

కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా ఆమంచి కృష్ణ మోహన్ నియమితులయ్యారు. ఈ మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ న్యూఢిల్లీలో 41 మందితో కూడిన నూతన అధ్యక్షుల జాబితాను విడుదల చేశారు. బాపట్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడం, శ్రేణులను ఏకతాటిపైకి తీసుకురావడం లక్ష్యంగా అమాంచికి ఈ బాధ్యతలను అప్పగించినట్లు నాయకులు చర్చించుకుంటున్నారు.
News January 4, 2026
KNR: ప్రత్యేక బస్సు కోసం మంత్రికి వినతి

కరీంనగర్లోని ప్రధాన విద్యాసంస్థలు, పర్యాటక ప్రాంతాలైన ఉజ్వల పార్క్, పాలిటెక్నిక్, శాతవాహన ఫార్మసీ కళాశాల మార్గంలో ప్రత్యేక ఆర్టీసీ బస్సును నడపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ను ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ కోరారు. విద్యార్థులు, ఉద్యోగుల రవాణా ఇబ్బందులపై ఆయన వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన మంత్రి, తక్షణమే ఈ రూట్లో బస్సు సర్వీసును పరిశీలించి ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
News January 4, 2026
పోలీస్ అతిథి గృహానికి సంబంధం లేదు: పోలీసు శాఖ

తిరుమలలో మద్యం బాటిళ్లు లభ్యమైన ప్రదేశం పోలీస్ అతిథి గృహానికి ప్రత్యక్ష సంబంధం లేదని పోలీస్ శాఖ తెలిపింది. బాలాజీకాలనీ సమీపంలోని పిట్టగోడ వెనుక చెట్లు పొదళ్లో ఉన్నాయి. ఆ ప్రదేశానికి పోలీస్ అతిథి గృహం 25 నుంచి 50 అడుగుల ఎత్తులో ఉంది. అది సాధారణ కార్ పార్కింగ్ అని పోలీసులు వెల్లడించారు. మరో వైపు విచారణ చేసి చర్యలు తీసుకుంటామని టీటీడీ కూడా స్పందించింది.


