News February 6, 2025

సిద్దిపేట: గురుకుల ప్రవేశాలకు నేడే లాస్ట్

image

రాష్ట్రంలోని గురుకులాల పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట జిల్లా అధికారులు సూచించారు. 2025–26లో ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌ గురుకులాల్లో 5వ తరగతిలో ఖాళీలు, 6 నుంచి 9వ తరగతి వరకు ఖాళీల భర్తీకి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 23న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

Similar News

News January 20, 2026

NZB: CM దావోస్ ట్రిప్ దండగ.. Xలో కల్వకుంట్ల కవిత

image

CM రేవంత్ రెడ్డి ట్రిప్ దండగ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత Xలో విమర్శించారు. ఎక్కే విమానం – దిగే విమానం .. రూ. లక్షల కోట్ల పెట్టుబడుల ప్రచారం తప్ప రెండేళ్లలో తెలంగాణకు మీరు తెచ్చిందేమిటి అని ప్రశ్నించారు. దావోస్ సమ్మిట్‌లు, TG రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో చేసుకున్న MOUలలో ఎన్ని పరిశ్రమలు గ్రౌండ్ అయ్యాయి.. ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.

News January 20, 2026

కోటప్పకొండకు రానున్న డిప్యూటీ సీఎం పవన్: ఎమ్మెల్యే

image

కోటప్పకొండ అభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. కోటప్పకొండలో నూతన రహదారుల ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించగా, ఈ నెల 22న వస్తానని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా మహాశివరాత్రి ఏర్పాట్లను కూడా పరిశీలించనున్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాల కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.

News January 20, 2026

హ్యాట్సాఫ్.. రూ.2కోట్ల ఆస్తిని దానం చేశారు

image

AP: నంద్యాల జిల్లా జలదుర్గానికి చెందిన పెద్ద వీరభద్రుడు, వెంకటేశ్వరమ్మ దంపతులు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. పిల్లలులేని ఈ దంపతులు తమ యావదాస్తిని మాధవరం రాములవారి గుడికి విరాళమిచ్చారు. దాదాపు రూ.2కోట్ల విలువజేసే ఆస్తి ఆలయానికి చెందేలా రిజిస్ట్రేషన్ చేయించారు. ఒక్క రూపాయి దానం చేయాలన్నా వందసార్లు ఆలోచించే ఈ రోజుల్లో అంత ఆస్తిని గుడికి రాసిచ్చేసిన ఈ దంపతులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.