News March 15, 2025
సిద్దిపేట: గ్రూప్-3లో సత్తా చాటిన యువకుడు

తొగుట గ్రామానికి చెందిన ముచ్చర్ల శ్రీకాంత్ యాదవ్ గ్రూప్-3 ఫలితాలలో సత్తా చాటాడు. శుక్రవారం విడుదల చేసిన ఫలితాలలో రాష్ట్రస్థాయిలో 232 ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం గ్రూప్-4 ఆఫీసర్గా HMDAలో విధులు నిర్వహిస్తున్నాడు. తన ప్రిపరేషన్ కొనసాగిస్తూ గ్రూప్-1 సాధించి డీఎస్పీ అవ్వడమే తన లక్ష్యమని ముచ్చర్ల శ్రీకాంత్ తెలిపాడు.
Similar News
News November 11, 2025
వెల్దండలో పెరిగిన చలి తీవ్రత..!

నాగర్కర్నూల్ జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతుంది. వెల్దండ మండల కేంద్రంలో గడచిన 24 గంటలలో 15.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బిజినేపల్లి 16.3, ఊర్కొండ, సిర్సనగండ్ల 16.6, పదర, తెలకపల్లి 16.8, యంగంపల్లి, బోలంపల్లి 16.9, కుమ్మెర 17.0, అమ్రాబాద్17.1, తోటపల్లి, ఎల్లికల్ 17.4, ఐనోల్ 17.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News November 11, 2025
ఇంటెలిజెన్స్ వైఫల్యం కాదు.. సమయస్ఫూర్తి!

ఢిల్లీలో పేలుడును ఇంటెలిజెన్స్ ముందే పసిగట్టలేదనే ప్రశ్నలు వస్తున్నాయి. కానీ దేశంలో 2వారాలుగా ఉగ్ర అనుమానితుల అరెస్టులు చూస్తే ఓ రకంగా అప్రమత్తమైన నిఘాతోనే దుర్ఘటన తీవ్రత తగ్గిందని చెప్పొచ్చు. ఫరీదాబాద్లో JK పోలీసులు నిన్న భారీ పేలుడు పదార్థాలతో ముగ్గురిని పట్టుకున్నారు. దీంతో ఆ టీమ్కు చెందిన డా.ఉమర్ తన వద్ద గల మెటీరియల్తో బ్లాస్ట్ చేశాడు. నిఘా నిద్రపోతే అంతా కలిసి భారీ నరమేథం సృష్టించేవారేమో!
News November 11, 2025
ప్రకాశం: పెద్ద చెర్లోపల్లికి చేరుకున్న సీఎం

ఇవాళ ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు పెద్ద చెర్లోపల్లి మండలం ఇర్లపాడు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ఆయనకు జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ, టీడీపీ ఇన్ఛార్జులు, కలెక్టర్, ఎస్పీ స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన సభాస్థలికి చేరకున్నారు.


