News March 15, 2025

సిద్దిపేట: గ్రూప్-3లో సత్తా చాటిన యువకుడు

image

తొగుట గ్రామానికి చెందిన ముచ్చర్ల శ్రీకాంత్ యాదవ్ గ్రూప్-3 ఫలితాలలో సత్తా చాటాడు. శుక్రవారం విడుదల చేసిన ఫలితాలలో రాష్ట్రస్థాయిలో 232 ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం గ్రూప్-4 ఆఫీసర్‌గా HMDAలో విధులు నిర్వహిస్తున్నాడు. తన ప్రిపరేషన్ కొనసాగిస్తూ గ్రూప్-1 సాధించి డీఎస్పీ అవ్వడమే తన లక్ష్యమని ముచ్చర్ల శ్రీకాంత్ తెలిపాడు.

Similar News

News November 20, 2025

పోలి పాడ్యమి: రేపు ఏమేం చేయాలో తెలుసా?

image

పోలి పాడ్యమి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి, 30 వత్తుల దీపం వెలిగించాలి. దాన్ని అరటి దొప్పలలో పెట్టి పారే నీటిలో వదలాలి. తద్వారా కార్తీక మాస దీపారాధన పుణ్యం లభిస్తుందని నమ్మకం. ఆ తర్వాత శివాలయానికి వెళ్లి, శివ లింగానికి అభిషేకం చేసి ‘ఓం నమశ్శివాయ’ అనే మంత్రాన్ని జపించాలి. సాయంత్రం తులసి కోట వద్ద దీపాలు వెలిగించి, పోలి స్వర్గం కథ విని, దీపదానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

News November 20, 2025

AVNLలో 133 ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

చెన్నైలోని ఆర్మ్‌డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (AVNL)లో 133 పోస్టులకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. Jr టెక్నీషియన్, Environ. Eng, డిప్లొమా టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిప్లొమా, BE, బీటెక్, BSc(ENG.), డిగ్రీ, PG, MBA, PGBDM, PG డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు NTC/NACగల అభ్యర్థులు అర్హులు. ఇంటర్వ్యూ/రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

News November 20, 2025

MHBD: వృద్ధురాలి దారుణ హత్య.. UPDATE

image

MHBD(D) రామన్నగూడెంలో నిన్న <<18334484>>వృద్ధురాలు హత్యకు<<>> గురైన విషయం తెలిసిందే. స్థానికులు, పోలీసుల ప్రకారం.. కురవి(M)కి చెందిన పద్మ భర్త మృతి చెందడంతో 2వ కూతురి ఇంట్లో ఉంటోంది. కూతురు, అల్లుడు HYDలో ఉంటుండగా ఒంటరిగా ఉంటోంది. ఉదయం నుంచి పద్మ బయటికి రాకపోవడంతో స్థానికులు వెళ్లి చూడగా రక్తపు గాయాలతో పడి ఉంది. SI రమేశ్ బాబు కేసు నమోదు చేశారు. బంగారం కోసమా? అత్యాచారంచేసి హత్య చేశారా? అనేది దర్యాప్తులో తేలనుంది.