News July 17, 2024

సిద్దిపేట: ఘోరం.. బాలుడిని 20 నిమిషాలు కరిచిన కుక్కలు

image

HYD జవహర్‌నగర్ పరిధిలో కుక్కల దాడిలో <<13644434>>బాలుడు మృతి <<>>చెందిన విషయం తెలిసిందే. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డికి చెందిన భరత్-లక్ష్మీ దంపతులు నెల కిందట HYD వచ్చారు. వారి కొడుకు నిహాన్ మంగళవారం రాత్రి ఇంటి ఎదుట ఆడుకుంటున్న సమయంలో గుంపుగా వచ్చిన కుక్కలు దాడి చేసి 20 నిమిషాలు కరిచాయి. అక్కడే ఉన్న ఓ వ్యక్తి గమనించి కుక్కలను తరిమాడు. బాలుడిని గాంధీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయాడు.

Similar News

News May 8, 2025

మెదక్: జాతీయ లోక్ అదాలత్‌పై సమావేశం

image

మెదక్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ సెక్రటరీ ఆర్.ఎం. సుభవల్లి జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ దృష్ట్యా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, అడ్వకేట్స్, పోలీస్ ఆఫీసర్లు, బ్యాంక్ మేనేజర్స్, ఇన్సూరెన్స్ అడ్వకేట్లు పాల్గొన్నారు. జూన్ 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ పడదగ్గ కేసులను ఎక్కువ సంఖ్యలో పరిష్కరించేలా కృషి చేయాలన్నారు. జడ్జి సిరి సౌజన్య పాల్గొన్నారు.

News May 7, 2025

జప్తి శివునూరు గ్రామంలో వ్యక్తి ఆత్మహత్య

image

నార్సింగ్ మండలం జప్తి శివునూర్ గ్రామ శివారులోని వ్యవసాయ పొలం వద్ద సుధాకర్ అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. నిజాంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన సుధాకర్ జప్తి శివునూర్ గ్రామానికి ఇల్లరికం వెళ్లారు. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధ, సంతానం లేకపోవడంతో మనస్తాపానికి గురై సుధాకర్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 7, 2025

మెదక్: రేపే మోడల్ స్కూల్ పరీక్ష

image

మెదక్ జిల్లాలో ఈనెల 27న ఆదివారం నిర్వహించే మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని DEO రాధా కిషన్ తెలిపారు. విద్యార్థులు పరీక్ష సమయానికి గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. విద్యార్థులు హాల్ టికెట్లను వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు. ఈ స్కూళ్లలో కార్పొరేట్‌కు దీటుగా ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుందని, ఈ అవకశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -SAHRE IT