News February 16, 2025

సిద్దిపేట: ఘోర రోడ్డు ప్రమాదం

image

సిద్దిపేట జిల్లా కుక్కునూరు పల్లి పోలీస్ స్టేషన్ పరిధి కొమురవెల్లి కమాన్ వద్ద ఆగి ఉన్న డీసీఎంను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తున్న కారు ఆగి ఉన్న డీసీఎంను ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్నా మమతా, భీమయ్య, మమత, పలయ్యలకు తీవ్ర గాయాలయ్యాయి. 108 అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News January 4, 2026

2 గంటలు అనర్గళంగా రేవంత్ ప్రసంగం

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ అసెంబ్లీలో 2 గంటలు ఏకధాటిగా మాట్లాడారు. రాత్రి 7.30 గంటల నుంచి 9.30 గంటల వరకు అనర్గళంగా ప్రసంగించారు. కృష్ణా జలాల కేటాయింపు, పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టుల విషయంలో BRS అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. నాటి CM KCR, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావే అంతా చేశారని ధ్వజమెత్తారు. అయితే నీళ్ల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వమని స్పష్టం చేశారు.

News January 4, 2026

సంగారెడ్డి: పది నుంచి టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు పరీక్ష

image

సంగారెడ్డి జిల్లాలో ఈనెల 10 నుంచి 13వ తేదీ వరకు టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. హాల్ టికెట్లు www.bse.telangana.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పారు. పరీక్షలు సెయింట్ ఆంతోని (శాంతినగర్), సెయింట్ ఆంథోని (విద్యానగర్), సెయింట్ ఆర్నాల్డ్, కరుణ పాఠశాలలో పరీక్ష జరుగుతాయని పేర్కొన్నారు.

News January 4, 2026

నదీ జలాలు-కాంగ్రెస్ ద్రోహాలపై రేపు హరీశ్ రావు PPT

image

“నదీ జలాలు- కాంగ్రెస్ ద్రోహాలు” అనే అంశంపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆదివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్(PPT) ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు హాజరుకానున్నారు. నదీ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను, జరుగుతున్న నష్టాన్ని ఈ సందర్భంగా ఆయన వివరించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.