News February 16, 2025
సిద్దిపేట: ఘోర రోడ్డు ప్రమాదం

సిద్దిపేట జిల్లా కుక్కునూరు పల్లి పోలీస్ స్టేషన్ పరిధి కొమురవెల్లి కమాన్ వద్ద ఆగి ఉన్న డీసీఎంను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తున్న కారు ఆగి ఉన్న డీసీఎంను ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్నా మమతా, భీమయ్య, మమత, పలయ్యలకు తీవ్ర గాయాలయ్యాయి. 108 అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 23, 2025
అనకాపల్లి: 4 ఎంపీపీ.. 2 వైస్ ఎంపీపీ ఎన్నికకు నోటిఫికేషన్

అనకాపల్లి జిల్లాలో ఈనెల 27న 4 MPP, 2 వైస్ ఎంపీపీ, ఒక కో ఆప్షన్ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ సీఈవో పి నారాయణమూర్తి శనివారం తెలిపారు. ఎన్నికలకు సంబంధించి ఎంపీ, ఎమ్మెల్యే, ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యులకు నోటీసు ద్వారా సమాచారం అందించినట్లు తెలిపారు. ఈనెల 27 ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట లోపు నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ అనంతరం ఎన్నిక జరుగుతుందన్నారు.
News March 23, 2025
పెద్దపల్లి: గీత ఐస్ క్రీమ్.. ఓ మధుర జ్ఞాపకం

ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఆ రోజుల్లో గీత ఐస్ క్రీమ్ లేకుండా కాలం గడిచేది కాదు. ఒక్క రూపాయికి మాత్రమే లభించే గీత ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్, పెప్సీ ఐస్ క్రీమ్లు ప్రస్తుత రోజుల్లో మధుర జ్ఞాపకంగా మారిపోయాయి. వందల రూపాయలు పెట్టి ఐస్ క్రీములు తిన్నప్పటికీ గీత ఐస్ క్రీమ్ మర్చిపోలేమని ఇప్పటికీ ఆ మాటలు వినిపిస్తూనే ఉంటాయి. మీ చిన్నతనంలో గీత ఐస్ క్రీమ్ తిన్నారా? తింటే.. కింద కామెంట్ చేయండి..!
News March 23, 2025
కడప జడ్పీ ఛైర్మన్.. వైసీపీకే ఖాయం

కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ మరోసారి YCPకి వచ్చే అవకాశం ఉంది. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజీనామాతో ఖాళీ కాగా, నేడు ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ రానుంది. జిల్లాలో 50 మంది జడ్పీటీసీలు ఉండగా, గత ఎన్నికల్లో YCP 49, TDP ఒక్కస్థానం గెలిచింది. ఇందులో ఒకరు చనిపోగా, TDPలోకి ఐదుగురు వెళ్లారు. అయినా YCP 42 స్థానాలతో ఆత్మవిశ్వాసంతో ఉంది. YCP నుంచి బి.మఠంకు చెందిన రామగోవిందురెడ్డి ఛైర్మన్కు ముందు వరుసలో ఉన్నారు.